News October 28, 2025

నిర్మల్ కలెక్టర్‌ను కలిసిన నూతన ఎంపీడీవోలు

image

గ్రూప్ వన్ పరీక్షలో అర్హత సాధించి, ఇటీవల జిల్లాలోని నాలుగు మండలాలకు కేటాయించిన నలుగురు ఎంపీడీవోలు ఈరోజు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను వారి తల్లిదండ్రులతోపాటు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో మాట్లాడుతూ.. ఎంపీడీవో విధులు, బాధ్యతలను గురించి వివరించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు.

Similar News

News October 29, 2025

ఖమ్మంలో పట్టు సడలుతున్న BRS..?!

image

ఖమ్మం జిల్లాలో BRS పట్టు సడలుతోంది. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితం కావడం పార్టీని కలవరపెడుతోంది. కమ్మ సామాజిక వర్గ నేతలకు పెద్దపీట వేసినప్పటికీ, ఆ వర్గం ఓటర్లు BRSను ఆదరించలేకపోయారనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తాతా మధు సైతం పార్టీకి బలం చేకూర్చలేకపోతున్నారనే ప్రచారం ఉంది. BCలకు అవకాశాలు కల్పిస్తే జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందనే టాక్‌ వినిపిస్తోంది.

News October 29, 2025

WNP: రోగులకు మెరుగైన చికిత్స అందించాలి- కలెక్టర్

image

జిల్లాలో వర్ష ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు డెంగీ పరీక్షలు కొనసాగించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం గోపాల్‌పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, అటెండెన్స్ వివరాలను తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

News October 29, 2025

‘తుపాను ప్రభావం తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి’

image

మొంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో సిద్దిపేట జిల్లా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావద్దని, ఎక్కడ ఇబ్బందులు ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వర్షాలు కురుస్తున్నప్పుడు విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తలు వహించాలని సూచించారు. తుపాను ప్రభావం తగ్గే వరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.