News October 28, 2025

సదరం శిబిరాన్ని పారదర్శకంగా నిర్వహించాలి: ASF అదనపు కలెక్టర్

image

దివ్యాంగుల ధ్రువపత్రం పునరుద్ధరణ, నూతన ధ్రువపత్రాల కోసం జిల్లాలో చేపట్టిన సదరం శిబిరాలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం ASF ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం శిబిరాన్ని సందర్శించి అభ్యర్థులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షల తీరును పరిశీలించారు. అర్హులైన దివ్యాంగులకు ధ్రువపత్రాలు అందించేందుకు సదరం శిబిరాన్ని నిర్వహించనున్నారు.

Similar News

News October 29, 2025

బీర, కాకరకాయలను ఎప్పుడు కోస్తే మంచిది?

image

బీరకాయలు రకాన్ని బట్టి 60 నుంచి 90 రోజులలో కోతకు వస్తాయి. కాయలు లేతగా ఉన్నప్పుడే కోయాలి. కాయలను ముదిరిపోకుండా 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే కోయాలి. కాయలు ముదిరితే పీచు పదార్ధం ఎక్కువై మార్కెట్‌కి పనికి రాకుండా పోతాయి. కాయలను ఒక అంగుళం కాడతో సహా కోయాలి. కాకర పంట నాటిన 60-70 రోజులకు కోతకు వస్తుంది. కాయలను లేతగా ఉన్నప్పుడు, 3-4 రోజుల వ్యవధిలో కోయాలి. దీని వల్ల దిగుబడి పెరిగి మంచి ధర వస్తుంది.

News October 29, 2025

మొంథా ఎఫెక్ట్.. ములుగు జిల్లాకు ఎల్లో అలర్ట్!

image

మొంథా తుఫాను ఎఫెక్ట్ కారణంగా ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లాకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా రైతులు, ప్రజలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలన్నారు. స్థానిక అధికారులు ఆయా ప్రాంతాల్లోని రైతులను, మత్స్యకారులను అప్రమత్తం చేయాలని సూచించారు.

News October 29, 2025

14 గంటలు ఆలస్యంగా అగర్తలా హంసఫర్ రైలు

image

మొంథా తుపాన్ నేపథ్యంలో చాలా రైళ్లు రద్దు చేసినప్పటికీ సుమారు 8 రైళ్లు మాత్రం ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిలో బెంగళూరు నుంచి బయలుదేరే అగర్తలా హంసఫర్ (12503) సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సుమారు 14 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ రైలు విశాఖకు బుధవారం ఉదయం నాలుగు గంటల 10 నిమిషాలకు రావాల్సి ఉంది. అయితే సుమారు రాత్రి 7 గంటలకు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.