News October 28, 2025
ఆదిలాబాద్: బాలుడి కిడ్నాప్కు యత్నం.. కేసు నమోదు

బాలుడి కిడ్నాప్ యత్నం కేసును నమోదు చేశామని వన్ టౌన్ సీఐ సునీల్ తెలిపారు. యూపీలోని ఫైజాబాద్కు చెందిన రాహుల్ అనే యువకుడు ఆదిలాబాద్ ఖానాపూర్ కాలనీలో ఒక బాలుడిని అపహరించే యత్నం చేస్తుండగా కాలనీకి చెందిన షేక్ హసన్తోపాటు కొందరు పట్టుకున్నారని పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారన్నారు. నిందితుడు తన పేరును సలీం, సల్మాన్ పేర్కొనగా ఆధార్ కార్డు పరిశీలించగా రాహుల్గా గుర్తించామన్నారు.
Similar News
News October 29, 2025
బీర, కాకరకాయలను ఎప్పుడు కోస్తే మంచిది?

బీరకాయలు రకాన్ని బట్టి 60 నుంచి 90 రోజులలో కోతకు వస్తాయి. కాయలు లేతగా ఉన్నప్పుడే కోయాలి. కాయలను ముదిరిపోకుండా 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే కోయాలి. కాయలు ముదిరితే పీచు పదార్ధం ఎక్కువై మార్కెట్కి పనికి రాకుండా పోతాయి. కాయలను ఒక అంగుళం కాడతో సహా కోయాలి. కాకర పంట నాటిన 60-70 రోజులకు కోతకు వస్తుంది. కాయలను లేతగా ఉన్నప్పుడు, 3-4 రోజుల వ్యవధిలో కోయాలి. దీని వల్ల దిగుబడి పెరిగి మంచి ధర వస్తుంది.
News October 29, 2025
మొంథా ఎఫెక్ట్.. ములుగు జిల్లాకు ఎల్లో అలర్ట్!

మొంథా తుఫాను ఎఫెక్ట్ కారణంగా ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లాకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా రైతులు, ప్రజలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలన్నారు. స్థానిక అధికారులు ఆయా ప్రాంతాల్లోని రైతులను, మత్స్యకారులను అప్రమత్తం చేయాలని సూచించారు.
News October 29, 2025
14 గంటలు ఆలస్యంగా అగర్తలా హంసఫర్ రైలు

మొంథా తుపాన్ నేపథ్యంలో చాలా రైళ్లు రద్దు చేసినప్పటికీ సుమారు 8 రైళ్లు మాత్రం ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిలో బెంగళూరు నుంచి బయలుదేరే అగర్తలా హంసఫర్ (12503) సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సుమారు 14 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ రైలు విశాఖకు బుధవారం ఉదయం నాలుగు గంటల 10 నిమిషాలకు రావాల్సి ఉంది. అయితే సుమారు రాత్రి 7 గంటలకు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.


