News October 28, 2025

ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

image

బాపట్ల జిల్లాలో తుపాన్ ప్రభావం నేపథ్యంలో విద్యుత్, ఇరిగేషన్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. తుపాన్‌ వల్ల నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం నారా చంద్రబాబు సూచనల మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులను ఆదేశించారు. వాగుల వద్ద ప్రజలు రోడ్లు దాటకుండా, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Similar News

News October 29, 2025

సిద్దిపేట: ‘దరఖాస్తు తేదీ పొడిగింపు’

image

2025-2026 విద్యా సంవత్సరానికి మైనారిటీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు తేదీ పొడిగించినట్లు సిద్దిపేట జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అహ్మద్ తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కళాశాలలు, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిసెంబర్ 31 వరకు గడువు పొడగించామని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు.

News October 29, 2025

సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ?

image

రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2027లో షూటింగ్ ప్రారంభవుతుందని, రజినీకి ఇదే చివరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు తర్వాత రిటైర్ కావాలని ఆయన డిసైడయ్యారట. కాగా ఆయన ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్-2’ చేస్తున్నారు. ఆ తర్వాత సి.సుందర్‌తో ఓ మూవీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. రజినీ-కమల్ మూవీని నెల్సన్ తెరకెక్కిస్తారని సమాచారం.

News October 29, 2025

SRPT: విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు: ఎస్పీ

image

పోలీస్ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎస్పీ నర్సింహ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ వారిగా నమోదైన కేసులు, కేసు విచారణ గురించి అధికారులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. యాప్‌ ద్వారా లోన్‌ ఇస్తామని చెప్పేవారి మాటలను నమ్మొద్దని సూచించారు.