News October 28, 2025

SRPT: ‘సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించాలి’

image

సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా అడిషనల్ కలెక్టర్ సీతారామారావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. మూఢ నమ్మకాలను పారద్రోలి శాస్త్రీయ వైఖరులను పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు, సభ్యులు రామచంద్రయ్య దయానంద్ ఉన్నారు.

Similar News

News October 29, 2025

అర్థరాత్రి ఆర్టీజీఎస్‌లో మంత్రి లోకేశ్ సమీక్ష

image

తుపాను తీవ్రతపై మంత్రి లోకేశ్ అర్థరాత్రి 12 గంటలకు ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అనిత, మంత్రి నారాయణ పాల్గొన్నారు. తుపాన్ తీరం దాటే సమయం కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ ఆదేశించారు. ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఆయన ఈ రాత్రికి ఆర్టీజీఎస్ కేంద్రంలోనే బస చేయనున్నారు. పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.

News October 29, 2025

సంగారెడ్డి: ‘శిథిలావస్థ తరగతి గదుల్లో బోధన వద్దు’

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో బోధన నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న గదుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఈ విషయాన్ని హెచ్ఎంలు తప్పక గమనించాలని సూచించారు. విద్యార్థుల భద్రతే ప్రధానమని, ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న గదుల్లో తరగతులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.

News October 29, 2025

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (పోక్సో స్పెషల్ జడ్జ్) ఎస్.సరిత మంగళవారం తీర్పు చెప్పారు. మణుగూరు(M) వాగు మల్లారానికి చెందిన మైనర్ బాలికపై జానంపేటకు చెందిన గాడిద శ్రీనివాస్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో 11 మంది సాక్షులను విచారించగా శ్రీనివాస్‌పై నేరం రుజువైంది. దాంతో శిక్ష పడింది.