News April 10, 2024
జూన్ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు

TG: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లను జూన్ నెలాఖరు వరకు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 7,149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 5,923 కేంద్రాలను ప్రారంభించినట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాలు తెలిపాయి. ఒక్క మే నెలలోనే 57% పంట కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Similar News
News February 23, 2026
VZM: ఇంటర్ పరీక్షకు 862 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షను 20,430 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 19,568 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 862 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు నియమించారు. జిల్లాలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.
News February 23, 2026
ఎర్రకోట, ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు

ఎర్రకోట, ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఖలిస్థానీ గ్రూప్ పేరుతో ఈమెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎర్రకోట, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు గుర్తించలేదని సమాచారం. ఉదయం ఢిల్లీలోని పలు స్కూల్స్కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎర్రకోట సమీపంలో <<19199047>>ఉగ్ర దాడులు<<>> జరగొచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించడం తెలిసిందే.
News February 23, 2026
ప్రభుత్వ కార్యాలయాల్లో Dy.CM ఫొటో… నేడు క్యాబినెట్లో చర్చ!

TG: GOVT ఆఫీసులలో Dy.CM భట్టి విక్రమార్క ఫొటో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం CM ఫొటో మాత్రమే ఉంది. ఇకపై Dy.CM ఫొటో కూడా ఏర్పాటు చేసేలా నేటి క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. APలో Dy.CM ఫొటో ఏర్పాటుపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేయడం తెలిసిందే. దానివల్ల నష్టం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో TGలో పెట్టినా న్యాయపరంగా ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది.


