News October 28, 2025

HYD: చీకటైనా పిల్లలు ఇంటికి రాలేదు.. పట్టించుకోరా?

image

యాచారం మం.లోని తాటిపర్తికి వెళ్లే బస్సు సకాలంలో రాకపోవడంతో బస్టాండ్‌లోనే విద్యార్థులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. నిత్యం ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతోన్నా పాలకులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థులు గమ్యస్థానాలకు చేరేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నేడు కొందరు లిఫ్ట్ అడిగి వెళ్లారు. మరికొందరు బస్టాండ్‌‌లో నిరీక్షించడం గమనార్హం. పాలకులకు పట్టవా? అన్న విమర్శలొస్తున్నాయి.

Similar News

News October 29, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వరంగల్, హన్మకొండ నగరాల్లో రోడ్లు, కాలనీలు జలమయమై జనజీవనం స్తంభించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసర సహాయార్థం జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

News October 29, 2025

అన్నమయ్య: యువతిని మోసం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు

image

యువతిని మోసం చేసిన వ్యక్తికి కడప 7వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి బుధవారం జీవిత ఖైదుతోపాటు రూ.1.6 లక్షల జరిమానా విధించింది. ఆ వివరాలను అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయ అధికారులు వెల్లడించారు. రైల్వే కోడూరు మండలం రెడ్దివారిపల్లికి చెందిన గొంతు సుబ్రమణ్యం, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని మోసం చేశాడు. దీంతో ఆ బాదితురాలు 2022లో కోడూరు పోలీసులని ఆశ్రయించగా నేడు శిక్ష పడింది.

News October 29, 2025

వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం

image

వరంగల్ జిల్లా మొత్తాన్ని వర్షాలు చుట్టుముట్టాయి. జిల్లాలో కేవలం ఒక్కరోజులో (ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు) 1245.4 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వర్ధన్నపేట (143.8 మి.మీ), నెక్కొండ (143.7 మి.మీ), పర్వతగిరి (130.5 మి.మీ), రాయపర్తి (115.3 మి.మీ) మండలాల్లో కురిసినట్లు రికార్డులు చెబుతున్నాయి.