News October 29, 2025
జనగామలో నవంబర్ 1 నుంచి శాతవాహన ట్రైన్ హాల్టింగ్

నవంబర్ 1 నుంచి జనగామలో శాతవాహన ట్రైన్కు హాల్టింగ్ ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు దశమంత్ రెడ్డి తెలిపారు. జనగామలో శాతవాహన ట్రైన్కు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవను కోరగా జనగామలో శాతవాహనకు హాల్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News October 29, 2025
పాక్కు చెంపపెట్టులాంటి ఫొటో.. శివాంగీతో ముర్ము

అంబాలా ఎయిర్ బేస్లో రఫేల్ రైడ్ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్క్వాడ్రన్ లీడర్ శివాంగీ సింగ్తో ఫొటో దిగారు. శివాంగీ రఫేల్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పైలట్. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత రఫేల్ జెట్లు కూల్చేశామన్న పాక్.. పైలట్ శివాంగీని ప్రాణాలతో బంధించామని ప్రచారం చేసింది. కానీ ఇవాళ రాష్ట్రపతి ఆమెతో ఫొటో దిగి పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ ఫొటో దాయాదికి చెంపపెట్టులాంటిదనే చెప్పాలి.
News October 29, 2025
జూబ్లిహిల్స్ బై పోల్స్.. ఎన్నికల నిర్వహణలో ఇవీ గణాంకాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నోటాతో కలిపి 59 మంది అభ్యర్థుల పేర్లను 407 పోలింగ్ బూత్లలో బ్యాలెట్ యూనిట్లలో (ప్రతి పోలింగ్ బూత్లో నాలుగు) అమర్చుతారు. 20 శాతం అదనంగా కలిపి 1954 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తారు. ఇక 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాట్లు వాడనున్నారు. ఇవన్నీ ఇపుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డీఆర్సీలో ఉన్నాయి.
News October 29, 2025
ధ్వజస్తంభం లేని గుళ్లలో ప్రదక్షిణ చేయకూడదా?

‘దాదాపు అన్ని ఆలయాల్లో గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. దీని ప్రతిష్ఠాపన వైభవంగా చేస్తారు. ధ్వజస్తంభం కూడా ఆలయ శక్తిలో భాగమే. అయితే కొన్ని ఆలయాల్లో ధ్వజస్తంభం ఉండదు. వాటిని వాయు ప్రతిష్ఠ ఆలయాలు అంటారు. అలాంటి చోట్ల నిత్య పూజ, నైవేద్యాలు తప్పనిసరి కాదు. ధ్వజస్తంభం ఉన్నా, లేకపోయినా గుడిలో ప్రదక్షిణ చేయవచ్చు. ఇంట్లో తులసి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే ఇది కూడా శుభప్రదం’ అని పండితులు చెబుతున్నారు.


