News October 29, 2025
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

◆ బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన పర్మినెంట్ ఉద్యోగులకు ₹15,400, కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ₹7,535 చొప్పున బహుమానం.. తిరుమల, తిరుపతి సిబ్బందికి అదనంగా 10%
◆ గోశాలల నిర్వహణకు నిపుణుల కమిటీ ఏర్పాటు.. నివేదిక ఆధారంగా సంస్కరణలు
◆ కొనుగోలు విభాగంలో అవకతవకలపై ACBతో విచారణ
◆ కాణిపాకం ఆలయం వద్ద ₹25Crతో యాత్రికుల వసతి సముదాయం, వివాహ హాల్స్ నిర్మాణానికి ఆమోదం
Similar News
News October 29, 2025
NI-MSMEలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్ 3 అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News October 29, 2025
తుఫాన్ నష్టంపై వేగంగా అంచనాలు: లోకేశ్

AP: ‘మొంథా’ ప్రభావంతో జరిగిన నష్టంపై వేగంగా ప్రాథమిక అంచనాలు రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి, చెట్లు కూలి కరెంటు నిలిచిపోయిందని చెప్పారు. విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందుబాటులో ఉండి బాధితులకు సహాయాన్ని అందించాలని సూచించారు.
News October 29, 2025
నేను చిరు మూవీలో నటించట్లేదు: మాళవిక

చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నారనే ప్రచారాన్ని హీరోయిన్ మాళవికా మోహనన్ ఖండించారు. ‘ఏదో ఒకరోజు చిరంజీవి సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకు ఉంది. అయితే మెగా158లో నటిస్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం’ అని క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రభాస్ ‘ది రాజాసాబ్’లో ఈ బ్యూటీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 2026 జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.


