News October 29, 2025
1,937 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు: మంత్రి నాదెండ్ల

ఏలూరు జిల్లాలో 54 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి, తుఫాను బాధితులైన 1,937 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతీ కేంద్రంలో భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 148 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, 318 మంది గర్భిణులను పీహెచ్సీల్లోకి తరలించామని ఆయన మంగళవారం రాత్రి పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
Similar News
News October 29, 2025
మణుగూరులో వ్యక్తి సూసైడ్

మణుగూరులోని సి-టైప్ గేట్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మల్లం శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
News October 29, 2025
సంగారెడ్డి: బిడ్డపై తండ్రి ప్రేమ అంటే ఇదే..!

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం AEO శ్వేత రెండు కిడ్నీలు ఫెయిలై HYD కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె తండ్రి బిరాదర్ శ్యామ్రావు తన ఒక కిడ్నీని కూతురికి దానమిచ్చి ప్రాణం పోశారు. వీరి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్వేతకు ICU నుంచి జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేశారని ఆమె తల్లి ఉమారాణి తెలిపారు. ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సభ్యుడు నాగేశ్ వారికి ధైర్యాన్నిచ్చారు.
News October 29, 2025
KNR: ‘గ్రూప్ పాలిటిక్స్కు చెక్’ పెట్టేది ఆయనేనా..?

KNR CONGలో గ్రూపు పాలిటిక్స్కు చెక్ పెట్టాలంటే MLA మేడిపల్లి సత్యం నాయకత్వం అనివార్యమని అధిష్ఠానం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. DCC అధ్యక్షుడి ఎంపికలో భాగంగా జిల్లాకు వచ్చిన AICC పరిశీలకులకు మెజారిటీ కార్యకర్తలు మేడిపల్లి సత్యం పేరును సూచించినట్లు తెలుస్తోంది. అవసరం ఉన్నచోట MLAలను DCC అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని PCC చీఫ్ స్పష్టం చేశారు. దీంతో సత్యంకు DCC ప్రెసిడెంట్గా అవకాశాలు మెరుగయ్యాయి.


