News October 29, 2025

తుఫాను: అన్నమయ్య జిల్లాలో సెలవు ప్రకటించాలని డిమాండ్

image

మొంథా తుఫానుతో ఇవాళ అన్నమయ్య జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD ప్రకటిచింది. వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అన్నమయ్య జిల్లాలోనూ సెలవు ప్రకటించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. వర్షాల ముప్పుతో విద్యార్థుల భద్రత దృష్ట్యా సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. తుఫాను దృష్ట్యా ప్రభుత్వం జిల్లాకు ₹50లక్షల నిధులు విడుదల చేసింది.

Similar News

News October 29, 2025

అక్రమ దత్తత.. ఏడుగురు అరెస్ట్: నల్గొండ ఎస్పీ

image

2 వేర్వేరు కేసులలో 10 రోజుల ఆడ శిశువును, 21 రోజుల మగ శిశువును అక్రమ దత్తత చేసిన ఏడుగురు వ్యక్తులను జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం వెల్లడించారు. ఆడపిల్ల పుట్టిందని భారంగా భావించి ఒకరు, డబ్బుల కోసం మరొకరు కన్నపేగు బంధం మరిచి పిల్లలను అమ్ముకోగా.. జిల్లా పోలీసులు ఇద్దరు చిన్నారులను రక్షించి శిశు గృహకు తరలించారు.

News October 29, 2025

ఏడాదిలో 69 గంజాయి కేసులు: ASF ఎస్పీ

image

గంజాయి సాగు, అక్రమ రవాణా, వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్ ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 69 కేసులు నమోదు చేసి 120 మందిని జైలుకు పంపించామన్నారు. సంబంధిత శాఖల అధికారులు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

News October 29, 2025

రేపు విశాఖపట్నంలో పాఠశాలలకు సెలవు

image

తుపాన్ కారణంగా విశాఖపట్నం జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో ప్రేమ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తుపాను బుధవారం మధ్యాహ్నం తీరం దాటినప్పటికీ, ఈదురు గాలులతో వర్షం భారీగా పడే అవకాశం ఉందని.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.