News October 29, 2025
అధ్వానంగా హోం మంత్రి పాదయాత్ర చేసిన రోడ్డు

కోటవురట్ల, ఎస్.రాయవరం మండలాల సరిహద్దులో ఇందేశమ్మవాగు ప్రాంతంలో ఆర్.అండ్.బీ.రహదారి పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఇంతకు ముందే శిథిలావస్థకు చేరుకున్న ఈ రహదారి వర్షాలకు మరింత దమనీయంగా తయారైంది. రహదారిపై ఏర్పడిన గోతుల్లో వర్షపు నీరు చేరడంతో నీటి కుంటలను తలపిస్తున్నాయి. దీనిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత గత ప్రభుత్వ హయాంలో పాదయాత్ర చేశారు.
Similar News
News October 29, 2025
KNRలో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్తో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సెలవు ప్రకటిస్తూ విద్యాధికారులకు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అందుబాటులో ఉండాలని సూచించారు.
News October 29, 2025
ఏసీబీకి చిక్కిన యాదాద్రి దేవాలయ అధికారి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పనిచేస్తున్న అధికారి ఉప్పల్లో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టు పడ్డాడు. ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.1,90,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఆలయంలో ఎలక్ట్రిసిటీ విభాగంలో పనిచేస్తున్న రామారావుకు సంబంధించిన బంధువుల ఇండ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
News October 29, 2025
రేపు యథావిధిగా పాఠశాలలు: నంద్యాల డీఈవో

నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలు రేపటి నుంచి యథావిధిగా పనిచేయాలని డీఈవో జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు ఉంటే గురువారం సెలవు ఇవ్వాలని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.


