News October 29, 2025

వనపర్తి: భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

image

‘మొంథా’ తుఫాను ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదని సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు విద్యుత్ వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News October 29, 2025

ములుగు: సిద్ధంగా డీడీఆర్ఎఫ్ బలగాలు..!

image

జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం ఉన్నందున డీడీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక్ష శిక్షణ పొందిన పోలీస్ సిబ్బంది సేవలందించేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రధానంగా కొండాయి, ఏటూరునాగారం, మంగపేట, మేడారం వంటి వరద ముంపు ప్రాంతాలకు వీరిని పంపించేందుకు యోచిస్తున్నారు. గర్భిణులు, అత్యవసర వైద్యం అవసరమైన వారికి డీడీఆర్ఎఫ్ సేవలు కీలకం కానున్నాయి.

News October 29, 2025

మొంథా ప్రభావం.. ములుగులో 2.1 సెం.మీ. వాన

image

మొంథా తుఫాను ప్రభావంతో ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సా.5 వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు విడుదల చేశారు. ములుగు మండలంలో 2.1 సెం.మీః, తాడ్వాయిలో 2, ఖాసీందేవిపేటలో 1.4 సెం.మీ. వాన పడింది. రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

News October 29, 2025

MBNRలో భారీ వర్షం..ఈ మెసేజ్ వచ్చిందా?

image

ఉమ్మడి జిల్లాలోని MBNR, GDWL, WNPT,NRPT జిల్లాలో వర్ష తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని Telangana Integrated Command and Control Centre (TGiCCC) తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఫోన్లకు హెచ్చరిక మెసేజ్లు పంపింది. మీకూ వచ్చాయా?