News October 29, 2025

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

సోమందేపల్లి(M) నల్లగొండ్రాయునిపల్లి వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. బెంగళూరులో ఉంటున్న గణేశ్ బంధువు మధుతో కలిసి బైకుపై రామగిరి(M) నసనకోట ముత్యాలమ్మ గుడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వెలగమేకలపల్లికి చెందిన జగదీశ్ నాయక్ బైకుపై రోడ్డు దాటుతుండగా గణేశ్ బైక్ ఢీకొట్టాడు. గణేశ్ మృతిచెందగా, మధుకు కాలు విరిగింది. ఎస్సై రమేశ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Similar News

News October 30, 2025

‘మహాకాళి’గా భూమికా శెట్టి

image

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రానున్న మహాకాళి సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మహాకాళిగా కన్నడ భామ భూమికా శెట్టి నటించనున్నారు. భూమికా శెట్టిని ‘మహా’గా పరిచయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈమె తెలుగులో ‘షరతులు వర్తిస్తాయి’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. PVCUలో తొలి లేడీ సూపర్ హీరోగా ఈమె కనిపించనున్నారు. ఈ మూవీకి పూజా అపర్ణ దర్శకత్వం వహించనున్నారు.

News October 30, 2025

చరిత్రలో భారీ లేఆఫ్స్ ఇవే..

image

కరోనా తర్వాత అగ్రశ్రేణి కంపెనీల్లోనూ లేఆఫ్స్ పెరుగుతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 14వేల మందిని తొలగించిన అమెజాన్.. మరో 16వేల మందిపై వేటుకు సిద్ధమవుతోంది. అయితే కరోనా కంటే ముందు కూడా కొన్ని సంస్థలు నష్టాల వల్ల భారీ లేఆఫ్స్ ఇచ్చాయి. 1993లో IBM 60వేల జాబ్స్, సిటీ గ్రూప్ 2008-09లో 75K, 2009లో జనరల్ మోటార్స్ 47K, 2012-15లో హ్యూలెట్-ప్యాకర్డ్ 55K ఉద్యోగాలకు కోత పెట్టాయి.

News October 30, 2025

వరద బాధితులను పరామర్శించిన మంత్రి కొండా

image

మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ గురువారం ఎన్‌.ఎన్‌. నగర్‌లోని వరద బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.