News October 29, 2025

సంగారెడ్డి: వరి కోతలను వాయిదా వేసుకోవాలి.. అధికారుల సూచన

image

తుఫాన్ ప్రభావంతో మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నందున సంగారెడ్డి జిల్లా రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. అందువల్ల రైతులు వాతావరణం మెరుగు పడేవరకు వరి కోతలు వాయిదా వేసుకోవాలన్నారు.

Similar News

News October 30, 2025

నల్గొండ: మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ

image

నల్గొండ శివారు రాంనగర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు మగ్గం వర్క్‌లో 31 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుంచి 45 లోపు ఉమ్మడి నల్గొండకు చెందిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు నవంబర్ 3 లోపు అప్లై చేసుకోవాలన్నారు.

News October 30, 2025

జనగామ కలెక్టర్‌ను కలిసిన డీపీఓ

image

జనగామ జిల్లా పంచాయతీ అధికారిగా ఎ.నవీన్ గురువారం కలెక్టరేట్లోని డీపీఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కలెక్టరేట్ అధికారులు, డీపీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన కార్యాలయ సిబ్బందితో సమావేశమయ్యారు.

News October 30, 2025

మోంథా తెచ్చిన తంటా.. ప్రయాణం గందరగోళం

image

తెలంగాణ వైపు దిశ మార్చుకున్న మోంథా తుపాను హైదరాబాద్ ప్రయాణికులను గందరగోళంలోకి పడేసింది. తుఫాను కారణంగా పలు బస్సులు, రైళ్లు రద్దు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 2 రోజుల్లో రైల్వే అధికారులు 137 రైళ్లను రద్దు చేశారంటే మోంథా ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సికింద్రాబాద్- ఖమ్మం- డోర్నకల్- మహబూబాబాద్ రూట్‌లో కురిసిన వర్షం వల్ల అనేక రైళ్లు రద్దయ్యాయి.