News October 29, 2025

18 ఓవర్లకు కుదింపు

image

వర్షం ఆగిపోవడంతో ఆస్ట్రేలియా-భారత్ తొలి టీ20 మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
*ఇన్నింగ్స్ 18 ఓవర్లకు కుదింపు
*ముగ్గురు బౌలర్లు 4 ఓవర్ల చొప్పున వేయొచ్చు
*ఇద్దరు బౌలర్లు 3 ఓవర్లు వేయొచ్చు
*పవర్ ప్లే 5.2 ఓవర్ల వరకు
> ప్రస్తుతం భారత్ స్కోర్ 5 ఓవర్లకు 43/1గా ఉంది. అభిషేక్ 19 రన్స్ చేసి ఔటయ్యారు. క్రీజులో గిల్ (16*), సూర్య (8*) ఉన్నారు.

Similar News

News October 30, 2025

సరైన నిద్రలేకపోతే అందానికి దెబ్బ

image

ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ నిద్రలేమి వేధిస్తోంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే నిద్రలేమితో అందం కూడా దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. సరైన నిద్రలేకపోతే శరీరం pH దెబ్బతిని చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. దీంతో వయసు పైబడినట్లు కనిపిస్తారు. అలాగే డార్క్ సర్కిల్స్, కళ్ల వాపు, ముడతలు, జుట్టు రాలిపోవడం వంటివి కూడా వస్తాయని చెబుతున్నారు.

News October 30, 2025

అన్నదాతకు ‘మొంథా’ దెబ్బ!

image

‘మొంథా’ తుఫాన్ తెలంగాణపై పిడుగులా వచ్చి పడింది. ఏపీ నుంచి దిశ మార్చుకుని రాష్ట్రంలోని అన్నదాతల ఆశలను తలకిందులు చేస్తోంది. కుండపోత వానలకు వేలాది ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి నేలవాలగా, పత్తి పూర్తిగా దెబ్బతింది. మిరప తోటలు నీటమునిగాయి. పలుచోట్ల ఆరబోసిన మక్కలు తడిచిపోయాయి. పెట్టుబడి మొత్తం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

News October 30, 2025

గుడికి వెళ్తే ప్రశాంతత ఎందుకు లభిస్తుందంటే..?

image

ఆలయాలను అయస్కాంత శక్తి అధికంగా ఉన్న స్థలాల్లో నిర్మిస్తారు. అయస్కాంత క్షేత్రం కేంద్ర స్థానాన్ని ఎంచుకుని అక్కడ మూల విరాట్టును ప్రతిష్ఠిస్తారు. దీనివల్ల ఆ శక్తి విగ్రహం ద్వారా భక్తుల శరీరం, మనసులోకి చేరుతుంది. క్షేత్రంలో కొంత సమయం గడపడం వల్ల అది మనలోని ప్రతికూలతలను తగ్గిస్తుంది. అందుకే గుడికి వెళ్తే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. కష్టాల నుంచి గట్టెక్కడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం లభిస్తుంది.