News October 29, 2025

‘మొంథా’ ఎఫెక్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం

image

TG: ‘మొంథా’ తుఫాను ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వరికోతల సమయం కావడంతో ఆరబోసిన ధాన్యానికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, రిజర్వాయర్ల నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలపై నుంచి రాకపోకలు నిషేధించాలని ఆదేశించారు. హైడ్రా, ఇతర రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.

Similar News

News October 30, 2025

ప్రకృతి సేద్యంలో వరి సాగు.. సుడిదోమ నివారణ ఎలా?

image

ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి పంటను సాగు చేస్తున్నప్పుడు సుడిదోమ ఉద్ధృతి పెరిగితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా వరి పొలంలో కాలిబాటలను తప్పనిసరిగా తీయాలి. పసుపు పచ్చ మరియు తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20 నుంచి 25 చొప్పున అమర్చాలి. 5 నుంచి 6 లీటర్ల తూటికాడ, కుంకుడు కాయల రసాన్ని 100 లీటర్ల నీటికి కలిపి మొక్కల పాదుల దగ్గర పిచికారీ చేయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి.

News October 30, 2025

81 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 81 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని NOV 10 లోపు స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. పోస్టును బట్టి PhD, మాస్టర్ డిగ్రీ, NET, CSIR, BE, బీటెక్, ME, ఎంటెక్, MS, MBBS, డిగ్రీ, ఇంటర్ , టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.cuk.ac.in/

News October 30, 2025

అపమృత్యు భయం పోవడానికి ఏ అభిషేకం..?

image

కార్తీక మాసంలో శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఆయనకు అభిషేకాలు చేస్తే శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే ఒక్కో అభిషేకంతో ఒక్కో ఫలితముంటుందని పండితులు చెబుతున్నారు. అపమృత్యు భయం పోవడానికి నువ్వుల నూనె అభిషేకం ఉత్తమం అంటున్నారు. ఫలితంగా అకాల మరణ భయం దరిచేరదని పేర్కొంటున్నారు. ‘నువ్వుల నూనె శని దేవునికి ప్రీతిపాత్రమైనది. శివుడిని ఈ నూనెతో అభిషేకిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి’ అని సూచిస్తున్నారు.