News October 29, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏర్పాట్లలో భాగంగా బుధవారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. జనరల్ అబ్జర్వర్ రంజిత్ కుమార్ అధ్యక్షతన పరిశీలన జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఈసీఐ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ప్రక్రియ కొనసాగింది.
Similar News
News October 30, 2025
రెండేళ్ల తర్వాత కేబినెట్లోకి హైదరాబాదీ!

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లకు తెలంగాణ కేబినెట్లో హైదరాబాదీకి చోటు దక్కింది. బుధవారం అధిష్ఠానం నుంచి అనూహ్యంగా అజహరుద్దీన్ పేరు ఖరారు చేయడం విశేషం. జూబ్లీహిల్స్ టికెట్ త్యాగం చేసిన ఆయన పార్టీకి విధేయుడిగానే వ్యవహరించారు. దీంతో ‘అజ్జూ భాయ్.. ఏం చేద్దాం’ అని ఆయన చుట్టూ అనుచరులు ప్రదక్షిణలు చేశారు. జూబ్లీ బైపోల్ ముంగిటే మంత్రి పదవి వరించడంతో అజ్జూ భాయ్ అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News October 30, 2025
BREAKING: హైదరాబాద్లో యువకుడి దారుణ హత్య

HYDలో దారుణ ఘటన వెలుగుచూసింది. బండ్లగూడలో బుధవారం రాత్రి ఓ పాన్ షాపు యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసిన్ (22) ఓల్డ్ సిటీకి చెందినవాడు. ఇతడికి రెండు నెలల క్రితమే వివాహమైంది. నలుగురు గుర్తు తెలియని దుండగులు దుకాణం వద్ద కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News October 30, 2025
ఏసీబీకి పట్టుబడ్డ యాదగిరిగుట్ట ఏఈఈ రామారావు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పనిచేస్తున్న అధికారి ఉప్పల్లో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టు పడ్డాడు. ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.1,90,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఆలయంలో ఎలక్ట్రిసిటీ విభాగంలో పనిచేస్తున్న రామారావుకు సంబంధించిన బంధువుల ఇండ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.


