News April 10, 2024
చంద్రగిరి: ఈతకు వెళ్లి యువకుడి మృతి

చంద్రగిరి పాతపేటకు చెందిన జయంత్ శర్మ ఐదుగురు స్నేహితులతో కలిసి డోర్నకంబాల గ్రామానికి సమీపంలోని వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి మంగళవారం వెళ్లాడు. ఈత సక్రమంగా రాని జయంత్ బావిలో మునిగిపోయాడు. అతని స్నేహితులు బావిలో గాలించి బయటికి తీశారు. చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జయంతి శర్మ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.
Similar News
News March 5, 2026
చిత్తూరు: వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం

చిత్తూరు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ పరిశీలకులను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జింక చలపతి (పుంగనూరు), బాబాజాన్ (పూతలపట్టు), మొగసాల కృష్ణమూర్తి (కుప్పం), వెంకటరెడ్డి యాదవ్ (పలమనేరు), మొగసాల రెడ్డప్ప (చిత్తూరు), రాహుల్ రాజారెడ్డి (నగరి), వల్లివేడు పృథ్వీ రెడ్డి (జీడి నెల్లూరు)కు పరిశీలకులుగా నియమించారు.
News March 5, 2026
చిత్తూరులో జాతీయ జెండా ఎగిరి.. 30 రోజులకు పైనే

చిత్తూరు జిల్లా కేంద్రంలో మువ్వన్నెల జాతీయ జెండా ఎగిరి ముచ్చటగా 30 రోజులకు పైనే అయింది. నగరంలోని గాంధీ కూడలి వద్ద “ఐ లవ్ చిత్తూరు” పార్కులో భారీ ఎత్తులో జాతీయ జెండా స్తంభం ఏర్పాటుచేసి అందులో జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అధికారులు జెండాను ఘనంగా ఆవిష్కరించిన అనంతరం దాదాపు జాతీయ జెండా ఎగరలేదు. స్తంభం మాత్రమే దర్శనమిస్తోంది. మన జాతీయ జెండా ఎగరడానికి దృష్టి పెట్టండి సారూ.!
News March 5, 2026
పెనుమూరు: బైక్లు ఢీ.. ఒకరి మృతి

ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుమూరు మండలంలో జరిగింది. పెనుమూరు మండలం స్వామి రెడ్డి పల్లికి చెందిన గోవిందు బైక్పై వస్తుండగా.. పాకాల మండలానికి చెందిన బాబు, రెడ్డప్ప ఆచారి మరొక బైక్పై వస్తూ చార్వగాని పల్లె సమీపంలో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో గోవిందు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


