News April 10, 2024

HYD: అర్ధరాత్రి గుడి ముందు MURDER

image

ఫుట్‌పాత్‌పై పడుకునే విషయంలో తలెత్తిన ఘర్షణ చివరకు హత్యకు దారితీసిన ఘటన HYD పహాడీషరీఫ్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర వాసి కామ్ సింగ్(40), జల్‌పల్లి వాసి నవనాథ్ స్థానికంగా ఉంటూ పోచమ్మ గుడి ముందు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వీరి మధ్య ఘర్షణ జరగగా నవనాథ్ కోపంలో రాయితో కామ్ సింగ్ తలపై మోది హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.

Similar News

News January 12, 2026

FLASH: బోరబండలో యువతి మర్డర్

image

బోరబండలో ఓ ఉన్మాది యువతిని పొట్టనబెట్టుకున్నాడు. తనతో సరిగ్గా మాట్లాడటం లేదని అక్కసుతో యువతిని అతడు దారుణంగా హత్య చేశాడు. గతంలో ఇద్దరికీ బంజారాహిల్స్‌లోని ఒక పబ్‌లో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువతి ఇటీవల ఊర్వశీ బార్‌కు షిఫ్ట్ కావడంతో మాట్లాడటం తగ్గిందని భావించిన నిందితుడు నిన్న మాట్లాడదామని పిలిచి హత్య చేసినట్లు సమాచారం. నిందితుడు ప్రస్తుతం బోరబండ పోలీసుల అదుపులో ఉన్నాడు.

News January 11, 2026

HYD: చైనా మాంజాతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చెయ్యి కట్!

image

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగిలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు బైక్‌పై చైతన్య (27) వెళ్తున్నాడు. బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పైకి రాగానే చైతన్య చేయికి గాలి పటం మాంజా తగిలింది. దీంతో మాంజా చెయ్యికి చుట్టుకోవడంతో చైతన్య చెయ్యి తెగింది. తీవ్ర గాయాలు అయిన చైతన్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

News January 11, 2026

HYD: కార్పొరేషన్ కోసం లష్కర్‌లో లడాయి

image

GHMCని 3గా విభజించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్ లేదా లష్కర్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడుతోంది. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ను విస్మరించడం తగదని స్థానికులు, BRS నేతలు మండిపడుతున్నారు. HYD- సికింద్రాబాద్ జంట నగరాలుగా పేరొందగా, సికింద్రాబాద్ పేరు లేకుండా పునర్వ్యవస్థీకరణ సరికాదంటున్నారు. సర్కార్ దిగొచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనేలా ఉద్యమం ఉద్ధృతం అయింది.