News October 29, 2025
ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలకు తావు లేదు: కలెక్టర్

అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు. కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎం.తిరుపతిని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినందుకు విధుల నుంచి తొలగించారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతి సహించబోదని, మరెవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
Similar News
News October 30, 2025
కామారెడ్డి: ఉజ్వల కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

కామారెడ్డి జిల్లాకు కొత్తగా 284 ఉజ్వల కనెక్షన్లు మంజూరైనట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం ఉజ్వల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిపిఎల్ కుటుంబాలు, గ్యాస్ కనెక్షన్ లేనివారు మాత్రమే అర్హులన్నారు. అర్హత గల లబ్ధిదారులు వెంటనే డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించుకోవాలని సూచించారు.
News October 30, 2025
వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న అరెస్ట్..!

టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో ఒంగోలు మాజీ ఎంపీ, మాజీ TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నను నిన్న రాత్రి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న బోలెబాబా డెయిరీ వేరొక డెయిరీని ముందు పెట్టి.. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలిసినా కమీషన్ల కోసం అంతా సైలెంట్ అయ్యారనే ఆరోపణలపైనా సిట్ విచారణ సాగిస్తుంది. ఈ క్రమంలో అప్పన్నను అరెస్ట్ చేశారు.
News October 30, 2025
సికింద్రాబాద్.. మరిన్ని రైళ్లు CANCEL

మొంథా తుఫాన్ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లను పార్షికంగా రద్దు చేస్తున్నట్లు SCR ప్రకటించింది. గుంటూరు సికింద్రాబాద్ 12705 పూర్తిగా క్యాన్సిల్ చేశారు. సికింద్రాబాద్- గుంటూరు రైలును 12706 వరంగల్ నుంచి గుంటూరు మధ్యలో క్యాన్సిల్ చేశారు.12701 గుంటూరు- సికింద్రాబాద్ రైలు డోర్నకల్ సికింద్రాబాద్ మధ్యలో క్యాన్సిల్ చేశారు.


