News April 10, 2024

కొండపి: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

image

కొండపి మండలం, కట్టుబడిపాలెం-వెన్నూరు గ్రామాల మధ్య మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. గోగినేనివారిపాలెంకు చెందిన గోగినేని శాంతి తన కూతురు యశ్విత లక్ష్మి(9), కుమారుడు దేవాన్ష్‌తో కలిసి స్కూటీపై గ్రామానికి వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో యశ్విత లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయి. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణబాజీబాబు చెప్పారు.

Similar News

News March 13, 2026

ప్రకాశం: రైతుల ఖాతాల్లో నేడు నగదు

image

PM కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి తెలిపారు. ప్రకాశం జిల్లాలోని రైతులకు రూ.108.30 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. దర్శికి రూ.24.40 కోట్లు, కొండపికి రూ.21.10 కోట్లు, ఒంగోలుకు రూ.5.31 కోట్లు, S.Nపాడు రూ.15.85 కోట్లు, అద్దంకి రూ.23.31 కోట్లు, కందుకూరుకు రూ.18.33 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. శుక్రవారం బ్యాంక్ ఖాతాల్లో నగదు మంజూరు అవుతుందని తెలిపారు.

News March 13, 2026

ప్రకాశం: రైతుల ఖాతాల్లో రూ.108.30 కోట్లు మంజూరు

image

PM కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి తెలిపారు. ప్రకాశం జిల్లాలోని రైతులకు రూ.108.30 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. దర్శికి రూ.24.40 కోట్లు, కొండపికి రూ.21.10 కోట్లు, ఒంగోలుకు రూ.5.31 కోట్లు, S.N పాడు రూ.15.85 కోట్లు, అద్దంకి రూ.23.31 కోట్లు, కందుకూరుకు రూ.18.33 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. శుక్రవారం బ్యాంక్ ఖాతాల్లో నగదు మంజూరు అవుతుందని తెలిపారు.

News March 12, 2026

మార్కాపురంలో కొత్తగా రూర్బన్ పంచాయతీలు

image

పంచాయతీ జనాభా వార్షిక ఆదాయం, భౌగోళిక స్వరూపం ఆధారంగా ప్రభుత్వం విభజన చేపట్టింది. ఇప్పటివరకు ఐదు గ్రేడులుగా ఉండగా వాటిని నాలుగు గ్రేడులుగా కుదించింది. కొత్తగా రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలు ఉండగా వాటిలో 8 రూర్బన్, 63 గ్రేడ్-1, 108 గ్రేడ్-2, 227 గ్రేడ్-3 పంచాయతీలుగా విభజించారు. రూర్బన్ పంచాయతీలకు గెజిట్ అధికారిని కార్యదర్శిగా నియమించనున్నారు.