News October 29, 2025
సిద్దిపేట జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

మొంతా తుఫాన్ ప్రభావంతో సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశాల మేరకు జూనియర్, డిగ్రీ, రెసిడెన్షియల్, స్కూల్స్ అన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని వెల్లడించారు.
Similar News
News November 1, 2025
సంగారెడ్డి: ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలోని పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో పరిశ్రమలలో భద్రత ప్రమాణాలపై సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరిశ్రమలో పనిచేసే ప్రతి కార్మికుడి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
News November 1, 2025
ANU: యూజీ, పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన బీటెక్, బీఈడి, ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ, ఎంటెక్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోగా అందజేయాలని సూచించారు. రీవాల్యుయేషన్కు ప్రతి పేపర్కు రూ.1860 చొప్పున, జవాబు పత్రాల వ్యక్తిగత పరిశీలన, జిరాక్స్ కాపీలకు రూ.2190 చొప్పున చెల్లించాలన్నారు.
News November 1, 2025
అంతర్గాం పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ

రామగుండం కమిషనర్ పరిధిలోని అంతర్గాం పోలీస్ స్టేషన్ ను సీపీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు, స్టేషన్ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి రికార్డ్ లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై సీపీ ఆరా తీశారు.


