News October 30, 2025
తిరుపతి: ఆర్టీసీ ఉద్యోగుల నూతన కమిటీ నియామకం

ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘ రీజినల్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కేఈ శాస్త్రి వెల్లడించారు. తిరుపతి యూత్ హాస్టల్లో బుధవారం సంఘం అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా సురేష్ నాయక్, కార్యదర్శిగా శ్రీనివాసులు, కోశాధికారిగా వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లాల గౌరవ అధ్యక్షుడిగా మైఖేల్, ముఖ్య సలహాదారుగా ద్వారకా నియమితులయ్యారు.
Similar News
News October 30, 2025
శరీరానికి ఎంత అయోడిన్ అవసరమంటే

శరీరానికి చాలా తక్కువ పరిమాణంలో అయోడిన్ ఉంటే సరిపోతుంది. రోజుకు కేవలం 150mg తీసుకుంటే చాలు. పిల్లలకు 50mg, గర్భిణులకు 200mg అయోడిన్ సరిపోతుంది. ఒక వ్యక్తి జీవితకాలంలో కేవలం అర టీస్పూన్ అయోడిన్ మాత్రమే అవసరమవుతుంది. మన శరీరంలో 25mg అయోడిన్ ఉంటుంది. కాబట్టి అయోడిన్ అధికంగా ఉండే ఆహారాన్ని శరీరానికి అవసరమైనంత మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అలాగని అతిగా తీసుకున్నా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
News October 30, 2025
KKR హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్

IPL: KKR హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్ నియమితులయ్యారు. జట్టుకు గత 3 సీజన్లుగా హెడ్ కోచ్గా ఉన్న చంద్రకాంత్ పండిట్ను ఈ ఏడాది JULYలో తొలగించిన విషయం తెలిసిందే. వారం క్రితమే కోచ్ పదవిపై నాయర్తో KKR సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. పండిట్ శిక్షణలో జట్టు 2024లో విజేతగా నిలిచినప్పుడు నాయర్ బ్యాటింగ్ కోచ్గా ఉన్నారు. అటు ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్లో UP వారియర్స్ జట్టుకు చీఫ్ కోచ్గా పనిచేశారు.
News October 30, 2025
MBNR: కరెంట్ స్తంభం గుంతలో పడి బాలుడి మృతి

గుంతలో పడి బాలుడు మృతిచెందిన విషాదకర ఘటన మిడ్జిల్ మండలంలో జరిగింది. బోయినపల్లికి చెందిన పిట్టల రామకృష్ణ, లక్ష్మమ్మ దంపతుల చిన్న కుమారుడు సిద్ధార్థ(3) ఇంటి ముందు విద్యుత్ స్తంభం కోసం తీసిన నీటి గుంతలో పడి మరణించాడు. ఆడుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ప్రమాదవశాత్తు అందులో పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


