News October 30, 2025

సింగరేణి జీఎంపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి: సీఎంఓఏఐ

image

జిల్లా బార్ అసోసియేషన్ వారు సింగరేణి జీఎంపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా అసోసియేషన్ వారు అన్నారు. వారు మాట్లాడుతూ.. ఇప్పటికే పైలట్ కాలనీ ఆసుపత్రి భవనాన్ని జిల్లా కోర్టుకు ఇచ్చామన్నారు. అదే విధంగా న్యాయమూర్తుల కోసం సింగరేణి క్వార్టర్లను, బంగ్లాస్ ఏరియా గెస్ట్ హౌస్ మైనారిటీ పాఠశాలకు, 70కి పైగా క్వార్టర్లను ప్రభుత్వ అధికారులకు ఇచ్చామన్నారు.

Similar News

News October 30, 2025

GDK నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సు

image

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని GDK డిపో ఆధ్వర్యంలో యాదగిరిగుట్టకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేశారు. NOV 4న ఉదయం 5 గంటలకు బయలుదేరి, అదే రోజు రాత్రి తిరిగి GDK చేరుకుంటుందని DM నాగభూషణం తెలిపారు. ఈ యాత్రలో యాదగిరిగుట్టతో పాటు స్వర్ణగిరి, కొమురవెల్లి మల్లన్నను దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. ఒక్కరికి ఛార్జీ ₹1100గా నిర్ణయించారు. రిజర్వేషన్ కోసం 7013504982 నంబర్‌ను సంప్రదించవచ్చు.

News October 30, 2025

మెనుస్ట్రువల్ లీవ్‌కు ఫొటో అడగడంపై ఆందోళనలు

image

మహిళలు బయటకు చెప్పలేని అంశాల్లో రుతుస్రావం ఒకటి. విధులకూ వెళ్లలేని స్థితి. ఈ కారణంతో సెలవు అడిగిన సిబ్బందిని మెనుస్ట్రువల్ ఫొటోలు పంపాలని MD వర్సిటీ(హరియాణా) అధికారులు అడగడం వివాదంగా మారింది. గవర్నర్ వర్సిటీని సందర్శించినప్పుడు ఇది చోటుచేసుకుంది. చివరకు తాము వాడిన ప్యాడ్స్ ఫొటోలు పంపినా సెలవు ఇవ్వలేదని సిబ్బంది వాపోయారు. దీనిపై ఆందోళనలతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ గుప్తా తెలిపారు.

News October 30, 2025

అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షించాలి: కలెక్టర్, ఎస్పీ

image

అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ తుఫాను ప్రభావ పరిస్థితులను సమీక్షించాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. ఈమేరకు కలెక్టరేట్లో తుఫాన్ ప్రభావంపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రతి 2 గంటలకు ఒకసారి నివేదికలు పంపించాలని, కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడవకుండా చూడాలన్నారు.