News October 30, 2025

శ్రీరాంపూర్: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

image

సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. కంపెనీ వ్యాప్తంగా నాలుగు ఏరియాలలో రూ.4.50 కోట్ల వ్యయంతో కొత్తగా వెయ్యి క్వార్టర్లు నిర్మించనున్నారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్ ఏరియాలో 449, రామగుండలంలో 318, మనుగూరులో 154, భూపాలపల్లిలో 79 క్వార్టర్లు నిర్మించనున్నారు. క్వార్టర్స్ నిర్మాణానికి అవసరమైన స్థలం, ఇతర ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Similar News

News November 1, 2025

ములుగు: యువకులకు గన్ ఎక్కడిది..?

image

ములుగు జిల్లాలో గన్‌తో యువకులు బెదిరింపులకు పాల్పడిన ఘటన ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ముగ్గురు యువకులను వరంగల్ టాస్క్ ఫోర్స్ టీం అదుపులోకి తీసుకున్నారు. అయితే యువకుల వద్ద ఉన్న గన్ ఒరిజినలేనా..? దాన్ని ఎవరూ ఇచ్చారు. వాళ్లు ఎరిరెవరిని బెదిరించిచారు..? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

News November 1, 2025

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్ రోహిత్

image

నేషనల్ అవార్డు గ్రహీత, ప్రముఖ టాలీవుడ్ సింగర్ పీవీఎన్‌ఎస్ రోహిత్ తన ప్రియురాలు డాక్టర్ శ్రేయను వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారు. ‘బేబీ’ చిత్రంలోని ‘ప్రేమిస్తున్నా’ పాటకు గానూ ఆయన జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. రోహిత్‌కు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

News November 1, 2025

APPLY NOW: CSIR-IMMTలో సైంటిస్ట్ పోస్టులు

image

భువనేశ్వర్‌లోని CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(IMMT)లో 30 సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్ , PhD అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://www.immt.res.in/