News October 30, 2025
TU: గెస్ట్ ఫ్యాకల్టీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని లా కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేరడానికి నియామక చేపట్టినట్లు లా కళాశాల ప్రిన్సిపల్ ప్రసన్నరాణి తెలిపారు. LLM/ML లేదా సరిసమాన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో సందర్శించాలన్నారు.
Similar News
News November 1, 2025
వృద్ధుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక వృద్ధుని ఇంటికి వెళ్లి కలెక్టర్ తన చేతుల మీదుగా పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మూర్తి, ఏడీ శశిబిందు, ఎంపీడీవో అశోక్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
News November 1, 2025
HYD: కొత్త మంత్రి అజహరుద్దీన్ శాఖలపై ఉత్కంఠ!

కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజహరుద్దీన్ శాఖల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నారు. అజహరుద్దీన్ మైనారిటీ సంక్షేమం, హోం శాఖలను పొందుతారని ఊహాగానాలు వచ్చాయి. సాధారణంగా ప్రభుత్వం ఒక రోజులోనే కొత్త మంత్రుల శాఖలను ప్రకటిస్తుంది. కాగా రేవంత్ మంత్రివర్గంలోని మంత్రులు తమ ప్రస్తుత శాఖలను కోల్పోవడానికి సిద్ధంగా లేరని సమాచారం. మరి ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారో చూడాలి. దీనిపై మీ కామెంట్?
News November 1, 2025
KNR: ముగిసిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు కరీంనగర్, జగిత్యాలలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసారు. మధ్యాహ్నం ముగిసేసరికి పోలింగ్ 44 శాతంగా నమోదయింది. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఫలితాల కోసం సభ్యులు, మద్దతుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


