News October 30, 2025
అనకాపల్లి: నేడు కూడా కొనసాగనున్న పునరావాస కేంద్రాలు

మొంథా తుఫాన్ తీరం దాటినా పునరావాస కేంద్రాలు గురువారం కూడా కొనసాగుతాయని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జిల్లాలో 78 పునరావాస కేంద్రాల్లో 3,993 మంది ఆశ్రయం పొందుతున్నారు. కేంద్రాల్లో వీరికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు మండల స్థాయి అధికారులు ఇన్ఛార్జ్లుగా వ్యవహరిస్తున్నారు.
Similar News
News October 30, 2025
రోజూ లిప్స్టిక్ వాడుతున్నారా?

పెదాలు అందంగా కనిపించడానికి చాలామంది మహిళలు లిప్స్టిక్ వాడుతుంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాలతో అనారోగ్యాలు వస్తాయంటున్నారు నిపుణులు. చాలా లిప్స్టిక్ల తయారీలో కాడ్మియం, సీసం, క్రోమియం, అల్యూమినియం రసాయనాలు వాడతారు. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థలు దెబ్బతినడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. లెడ్ ఫ్రీ, నాన్ టాక్సిక్ ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.
News October 30, 2025
పాలమూరు: నేడే.. డయల్ యువర్ డిఎం

ఆర్టీసీ సమస్యలపై మహబూబ్ నగర్ డిపో ఆధ్వర్యంలో ఇవాళ డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సుజాత తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని ప్రయాణికులు తమ సమస్యలను సలహాలను, సూచనలను గురువారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 వరకు తెలుపాలన్నారు. 99592 26295 చరవాణి నంబర్కు ఫోన్ చేసి సమస్యలను వివరించాలన్నారు. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 30, 2025
VJA: ఆలయాల నష్టంపై కమిషనర్ సమీక్ష

‘మొంథా’ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని దేవాదాయ సంస్థలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కమిషనర్ కె. రామచంద్ర మోహన్ బుధారం ఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆలయ భవనాలు, ఆస్తుల నష్టం వివరాలు సేకరించి, తక్షణ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిసరాల శుభ్రత, శానిటేషన్ను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.


