News April 10, 2024

సైబర్ క్రైమ్ కేసులో నిందితులుగా నెల్లూరురోళ్లు

image

కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా టిపుటూరుకు చెందిన అనూషా సైబర్ మోసానికి గురయ్యారు. గత ఏడాది డిసెంబర్‌లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి వివిధ దశల్లో రూ.20 లక్షలను సైబర్ నేరస్తులు లాగేశారు. దీనిపై కర్ణాటక పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో నెల్లూరు శోధన్ నగర్‌కు చెందిన డి.జగదీశ్, సంతోశ్, వెంకటగిరి మండలం వల్లివేడుకు చెందిన సురేశ్, కార్వేటినగరానికి చెందిన మునీంద్ర ఉన్నారు.

Similar News

News March 15, 2025

నెల్లూరు: 174 పరీక్షా కేంద్రాలు.. 33,434 మంది విద్యార్థులు

image

సంగం జడ్పీ హైస్కూల్‌ను శనివారం డీఈవో సందర్శించారు. పదో తరగతి పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈవో బాలాజీ రావు మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యుత్ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 174 పరీక్షా కేంద్రాలలో 33,434 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు.

News March 15, 2025

రౌడీ షీటర్ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ నెల్లూరు

image

నెల్లూరు నగరం పాత వేదయపాలెంకు చెందిన రౌడీ షీటర్ సృజన్ కృష్ణ (చింటూ)ను అత్యంత కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో హత్య చేశారు. ఈ హత్య వెనుక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ తరలించారు. హత్యకు గల కారణాలపై వేదాయపాలెం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి సాంకేతిక పరిశోధనతో పాటు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

News March 14, 2025

నెల్లూరులో దారుణ హత్య

image

నెల్లూరు దారుణ హత్య చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని  దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. గతంలో రామలింగపురం అండర్ బ్రిడ్జి దగ్గర జరిగిన కత్తి రవి హత్య కేసులో ఉన్న చింటూగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!