News October 30, 2025

HYD: నేడు మెగా జాబ్ మేళా

image

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. HYD సిటీ పోలీస్ సౌత్ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో OCT 30న గుడిమల్కాపూర్ రూప్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఉద్యోగాలు పొందేందుకు 10వ తరగతి పాస్, ఫెయిల్ అయినవారి నుంచి డిగ్రీ హోల్డర్స్ వరకు అందరూ అర్హులే. ఐటీ, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మసీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు 87126 61501ను సంప్రదించండి.

SHARE IT

Similar News

News October 30, 2025

కోల్‌కత్తాలో తప్పించుకున్నా శంషాబాద్‌లో దొరికాడు

image

విశాల్ అనే వ్యక్తి కోల్‌కత్తా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ వచ్చాడు. ఆ తర్వాత అతడు మరో విమానంలో బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అతడి లగేజీని భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా బుల్లెట్ (38MM లైవ్ బుల్లెట్ ) బయటపడింది. దాని గురించి వివరాలు అడగ్గా సరైన సమాధానం లేదు. దీంతో ఆర్జీఐఏ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

News October 30, 2025

అంతటా 20మంది లోపే.. జూబ్లీహిల్స్‌లోనే 58 మంది

image

వచ్చేనెల 11న జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 58 మంది బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా జూబ్లీహిల్స్‌తో సహా మరో 7 చోట్ల బైపోల్స్ జరుగుతున్నాయి. అక్కడ మాత్రం పోటీచేస్తున్న వారి సంఖ్య 20లోపే ఉంది. బుడ్గాంలో 17(J&K), నగ్రోతలో 10(J&K), ఘట్సిలలో 13(ఝార్ఖండ్), డాంపలో 5 (మిజోరం), నువపడలో 14(ఒడిశా), తర్నతరన్లో 15(పంజాబ్), అంటలో 15(రాజస్థాన్) మంది పోటీలో ఉన్నారు.

News October 30, 2025

జూబ్లీ బైపోల్ వైపు.. నార్త్ ఇండియన్స్ చూపు

image

జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న బైపోల్ నార్త్ ఇండియన్స్ చూపు మనవైపు తిప్పింది. జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు సౌత్ స్టేట్‌లోని మనదగ్గర బై పోల్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉపఎన్నికలు సౌత్ ఇండియాలో కేవలం తెలంగాణ (జూబ్లిహిల్స్)లోనే జరుగుతోంది. పై రాష్టాలన్నింటిలోకి భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున పరిస్థితి రిజల్ట్ ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది.