News October 30, 2025

ఉప్పునుంతలలో అత్యధిక 63.4 మీ. మీ వర్షపాతం

image

తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఉప్పునుంతల మండలంలో 63.4. మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయిందని జిల్లా అధికారులు తెలిపారు. ఈ వర్షం కారణంగా చెరువులు కుంటలు నిండి అలుగుబరాయి. వర్షం కారణంగా ఉప్పునుంతల మండలంలో ఓ వ్యక్తి నీటిలో కొట్టుకు వచ్చి చనిపోయాడు. గేదెలు మేకలు సైతం మృత్యువాత పడ్డాయి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

Similar News

News October 30, 2025

MBNR: కరెంట్ స్తంభం గుంతలో పడి బాలుడి మృతి

image

గుంతలో పడి బాలుడు మృతిచెందిన విషాదకర ఘటన మిడ్జిల్ మండలంలో జరిగింది. బోయినపల్లికి చెందిన పిట్టల రామకృష్ణ, లక్ష్మమ్మ దంపతుల చిన్న కుమారుడు సిద్ధార్థ(3) ఇంటి ముందు విద్యుత్ స్తంభం కోసం తీసిన నీటి గుంతలో పడి మరణించాడు. ఆడుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ప్రమాదవశాత్తు అందులో పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 30, 2025

భక్తిని పెంచే సాధనాలు ‘రుద్రాక్ష, విభూతి’

image

మానవుడు భగవంతునిపై భక్తిని పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రుద్రాక్ష ధారణ ద్వారా ఓ వ్యక్తి నాలుగో వంతు భక్తిని పొందుతాడు. విభూతి ధారణ వల్ల సగ భాగం భక్తి లభిస్తుంది. ఇక మంత్ర జపం చేస్తే మూడు వంతుల భక్తిని సాధించవచ్చు. ఈ పనులన్నింటితో పాటు దేవుడిని పూజిస్తే ఆ వ్యక్తి పూర్ణ భక్తిని పొందుతాడు. పూర్ణ భక్తి లభించిన తర్వాత, దాని అంతిమ ఫలం జన్మ రాహిత్యమే. అంటే మోక్షం పొందడమే అన్నమాట. <<-se>>#SIVOHAM<<>>

News October 30, 2025

రామగుండం: ‘విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి’

image

RGM సింగరేణి వైద్య కళాశాలలో గురువారం జరిగిన వైట్ కోట్ సెర్మనీలో పాల్గొన్న పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష వైద్యవృత్తిని ఎంచుకున్న విద్యార్థులు ఏ విపత్కర పరిస్థితులలోనైనా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సింగరేణి మెడికల్ కాలేజ్ అత్యుత్తమ వసతులతో ఉన్నదని, ఫ్యాకల్టీ కట్టుబాటుతో పనిచేస్తోందని తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. నరేందర్, డా. లావణ్య, డా. ప్రదీప్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.