News October 30, 2025
కోస్గి: కల్లు సీసాలో ఎలుక కలకలం

కల్లు తాగేందుకు వెళ్లిన ఓ మహిళకి ఊహించని ఘటన ఎదురైంది. తాను తీసుకున్న కల్లు సీసాలో చనిపోయిన కనిపించడంతో.. షాక్కు గురై ఆందోళన చెందింది. కోస్గి మండలం నాగుసాన్పల్లిలో ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన బాలమణి బుధవారం తాగి ఎందుకు దుకాణంలో కల్లు కొనుగోలు చేసి, అక్కడే తగేందుకు ప్రయత్నించగా సీసాల నుంచి కల్లు బయటకు రాలేదు. గమనించి చూడగా ఎలుక కనబడింది. అప్రమత్తమైన తోటి వారు కల్లు పారబోశారు.
Similar News
News October 30, 2025
ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

తుపాన్ ప్రభావం కారణంగా కృష్ణా నది, నల్లమడ కాలువ అంచున ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గురువారం సూచించారు. ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. కృష్ణా నది వరద ముంపు ప్రమాదం ఉన్న రేపల్లె, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
News October 30, 2025
‘రామగుండం అభివృద్ధి.. గడువులోగా పూర్తి చేయండి’

RMGలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. RMG మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. TUFIDC సహా వివిధ పథకాల కింద జరుగుతున్న పనులను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ తదితర అధికారులు పాల్గొన్నారు.
News October 30, 2025
KNR: మొంథా తుఫాన్.. రైతన్నలకు మిగిల్చింది తడిసిన ధాన్యమే

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అధికారుల అంచనా ప్రకారం 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో తడిసి ముద్దయినట్లు సమాచారం. చేతికి వచ్చిన పంట అమ్ముకునే సమయంలో వర్షాలు పడి పంట నష్టాన్ని కలిగించిందన రైతులు వాపోయారు. రైతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించే సాయమే మిగిలిందని రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు.


