News October 30, 2025

కామారెడ్డి జిల్లా వర్షపాతం వివరాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడ్డ మొంథా తుఫాను ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో 24 గంటల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా మాచారెడ్డి మండలంలో 18.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. నాగిరెడ్డిపేట్‌లో 13, జుక్కల్‌ 10 మి.మీ వర్షపాతం నమోదైంది. నస్రుల్లాబాద్ మండలంలో అత్యల్పంగా 3 మి.మీ వర్షం కురిసింది. తుఫాన్ కారణంగా పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News October 30, 2025

పంట నష్టం నివేధికను తయారు చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో తుపాను ప్రభావం వల్ల పంట నష్టాల నివేధికను తయారు చేయాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం బాపట్ల కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాల్‌లో ఆయన మాట్లాడారు. తుపాను ప్రభావంవల్ల దెబ్బతిన్న పంట నష్టం అంచనాలు, కృష్ణా నది, నల్లమడ కాలువలు ప్రవాహం ఎక్కువగా ఉన్నందున తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జిల్లాలో తుపాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేయాలన్నారు.

News October 30, 2025

పెద్దన్నవారిపల్లికి సీఎం చంద్రబాబు రాక

image

సీఎం చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన ఖరారైంది. నవంబర్ 1న తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ సతీశ్ కుమార్ హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు.

News October 30, 2025

WGL వాయిదాపడిన ఎస్ఏ-1 పరీక్షలు

image

అక్టోబర్ 24 నుంచి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సమ్మెటివ్ అసెస్మెంట్-1 నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలతో బుధవారం మధ్యాహ్నం, గురువారం ఉదయం, మధ్యాహ్నం నిర్వహించాల్సిన పరీక్షలు పోస్ట్‌పోన్ అయ్యాయి. వాయిదా పడిన ఈ పరీక్షలను నవంబర్ 1, నవంబర్ 3 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు డీఈవో బి.రంగయ్య నాయుడు పేర్కొన్నారు.