News October 30, 2025

వివేకానగర్ కాలనీ: శ్రీ హోమ్స్ అపార్ట్మెంట్ జలదిగ్బంధం

image

మొంథా తుఫాన్ ప్రభావంతో హనుమకొండ నగరంలోని వివేకానగర్ కాలనీలో తీవ్ర వరద పరిస్థితులు నెలకొన్నాయి. తులసీ బార్ ఎదురుగా ఉన్న శ్రీ హోమ్స్ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియా పూర్తిగా నీట మునిగిపోగా, 60 ఫ్లాట్లలో నివసిస్తున్న 220 మంది బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. రాత్రి నుంచి విద్యుత్, తాగునీరు, పాలు, వంట సామగ్రి అందుబాటులో లేక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News October 30, 2025

రేపు వనపర్తిలో 2కే రన్: కలెక్టర్

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని 2కే రన్ నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమయ్యే ఈ పరుగు పాలిటెక్నిక్ కళాశాల వద్ద ముగుస్తుందని తెలిపారు. ఈ రన్‌ను విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News October 30, 2025

ముంబై కిడ్నాప్.. ఆ 35 నిమిషాలు ఏం జరిగింది?

image

ముంబై <<18151381>>కిడ్నాప్‌ <<>>ఘటనలో క్విక్ రియాక్షన్ టీమ్ 35 నిమిషాల ఆపరేషన్ నిర్వహించింది. 8మంది కమాండర్ల టీమ్ బాత్రూమ్ ద్వారా స్టూడియోలోకి వెళ్లింది. తొలుత నిందితుడు రోహిత్‌తో చర్చలు జరిపింది. కానీ లోపలికొస్తే షూట్ చేస్తానని, గదిని తగలబెడతానని అతడు బెదిరించాడు. తర్వాత ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో రోహిత్‌పై లీడ్ కమాండో కాల్పులు జరిపి గాయపరిచారు. అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించగా అక్కడ రోహిత్‌ చనిపోయాడు.

News October 30, 2025

మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల

image

ఖమ్మం: మున్నేరు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ 28 అడుగుల మార్కును దాటడంతో, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సాయంత్రం కలెక్టర్, సీపీతో కలిసి నదిని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, తగిన సమీక్షలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ సహా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.