News October 30, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: కేటీఆర్.. అన్నీ తానై

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తమ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉపఎన్నికలో పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు స్థానిక నేతలతో చర్చిస్తూ, ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మొత్తమ్మీద ఈ ఎన్నికలను తన భుజస్కంధాలపై మోస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

Similar News

News October 30, 2025

మంచిర్యాల: పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి: MCPIU

image

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాల కారణంగా విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సెలవులు ప్రకటించాలని కోరారు.

News October 30, 2025

అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పంకజ్ కుమార్ మీనా

image

చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా నియమితులయ్యారు. ఈమేరకు DGP హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పంకజ్ కుమార్ మీనా చింతూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో గంజాయి నిర్మూలన, మావోయిస్టుల కార్యకలాపాల నియంత్రణకు విశేష కృషి చేశారు.

News October 30, 2025

ఖమ్మం: బట్టిపట్టే చదువుకు స్వస్తి – ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ ప్రారంభం

image

ప్రతి విద్యార్థిలో చదివే సామర్థ్యం పెంపొందించే లక్ష్యంతో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రోజూ గంటసేపు రీడింగ్ స్కిల్స్ అభ్యాసం చేయించాలని సూచించారు. 30 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి విద్యార్థి చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు.