News October 30, 2025
ఇంజినీరింగ్ అర్హతతో 30 పోస్టులు

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NEEPCO) 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు GATE-2025 అర్హత సాధించిన అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, గేట్ స్కోరు , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://neepco.co.in
Similar News
News October 31, 2025
వర్డ్ ఆఫ్ ది ఇయర్ తెలుసా?

ఈ ఏడాదికి ‘67’ను వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ప్రముఖ ఆన్లైన్ డిక్షనరీ వెబ్సైట్ డిక్షనరీ.కామ్ ప్రకటించింది. నంబర్ను పదంగా పేర్కొనడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి అర్థం లేదని, నిర్వచించలేమని వెబ్సైట్ స్పష్టం చేసింది. అమెరికన్ ర్యాపర్ స్క్రిల్లా డ్రిల్ <
News October 30, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటలలోపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 30, 2025
అమల్లోకి రాని 8.82 లక్షల కోర్టు తీర్పులు

కోర్టులు వరమిచ్చినా అధికారులు కరుణించలేదన్నట్లు మారింది దేశంలో తీర్పుల అమలు. న్యాయం కోసం దాఖలైన కేసులు 5CRకు పైగా ఉండగా తీర్పులు వచ్చినా అమలు కోసం ఎదురుచూస్తున్న వారు 8.82 లక్షల మంది ఉన్నారు. జిల్లా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న ఈ కేసుల్లో 39% MHలో ఉన్నాయి. TN 86148, KL 82997, AP 68137,MP 52219 కేసులున్నాయి. ఈ తీర్పులను ఆరునెలల్లో అమలయ్యేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని SC అన్ని HCలను ఆదేశించింది.


