News October 30, 2025

జూబ్లీ బైపోల్ వైపు.. నార్త్ ఇండియన్స్ చూపు

image

జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న బైపోల్ నార్త్ ఇండియన్స్ చూపు మనవైపు తిప్పింది. జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు సౌత్ స్టేట్‌లోని మనదగ్గర బై పోల్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉపఎన్నికలు సౌత్ ఇండియాలో కేవలం తెలంగాణ (జూబ్లిహిల్స్)లోనే జరుగుతోంది. పై రాష్టాలన్నింటిలోకి భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున పరిస్థితి రిజల్ట్ ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది.

Similar News

News October 31, 2025

సిరిసిల్లలో ఎస్పీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

image

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో గురువారం రాత్రి పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ర్యాలీని ప్రారంభించి, నేతన్న చౌరస్తా నుంచి గాంధీ విగ్రహం వరకు నడిపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News October 31, 2025

HNK: ‘మా బేబీ మాకు కావాలి’ అంటూ బంధువుల ఆందోళన

image

హన్మకొండ నయినగర్‌లోని ఓ హాస్పిటల్‌లో ఆపరేషన్ సమయంలో శిశువు మృతి చెందడం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆపరేషన్ వికటించి బాబు మరణించాడని, అయితే ఆస్పత్రి వైద్యులు ఈ విషయాన్ని దాచిపెట్టి నాలుగు రోజులుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ‘మా బేబీ మాకు కావాలి’ అంటూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగగా.. డాక్టర్‌ తప్పిదం లేదంటూ హాస్పత్రి సిబ్బంది వాదిస్తున్నారు.

News October 31, 2025

KNR: ‘చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం’

image

KNR జిల్లా చిట్‌ఫండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొదుపు దినోత్సవం నిర్వహించారు.‌ ‘ఈరోజు మనం పొదుపు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది కేవలం ఒక ఆచార దినం కాదు. ఇది ప్రతి కుటుంబంలో ఆర్థిక శ్రద్ధ, భవిష్యత్‌ భద్రత, క్రమశిక్షణకు సంకేతం’ అని అధ్యక్షులు పెంట శ్రీనివాస్ అన్నారు. చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.