News October 30, 2025

పార్వతీపురం: రచ్చబండే క్లాస్ రూమ్ అయ్యింది..!

image

కురుపాం మండలంలో గోలవలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావ్యవస్థకు చేరుకుంది. వర్షాలు పడినప్పుడు పూర్తిగా కారిపోతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితిల్లో గ్రామ రచ్చబండ దగ్గర విద్యార్థులకు టీచర్లు చదువులు చెప్పుతున్నారు. సర్పంచ్ సురేశ్ మాట్లాడుతూ.. సుమారు 50 సంవత్సరాలు క్రితం నిర్మించిన భవనం కావడంతో శిథిల వ్యవస్థకు చేరుకుందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరారు.

Similar News

News October 31, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 31, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 31, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.14 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 31, 2025

వరంగల్: ఎస్ఏ పరీక్షలు వాయిదా!

image

వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఎస్ఏ పరీక్షలను వాయిదా వేసినట్లు డీఈవోలు రంగయ్య, వాసంతి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా గురు, శుక్ర, శని వారాల్లో నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేశామని ఎప్పుడు నిర్వహించేది శనివారం వెల్లడిస్తామని రంగయ్య తెలిపారు. వర్షాల కారణంగా వాయిదా వేసిన పరీక్షలను సోమ, మంగళ, బుధవారాల్లో నిర్వహిస్తామని HNK DEO వాసంతి తెలిపారు.