News October 30, 2025
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

కొండాపురంలోని పాత కొండాపురం సమీపంలో చిత్రావతి నది వంతెన సమీపంలో గురువారం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అతను రైలు కింద పడడంతో అతని తల, మొండెం రెండు భాగాలుగా విడిపోయాయి. మృతుడి ఒంటిపై పసుపు కలర్ చొక్కా, బ్లూ కలర్ పాయింట్ ఉన్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 31, 2025
వచ్చేనెల 7న వైవీయూ అంతర కళాశాలల క్రీడల పోటీలు

నవంబరు 7న అంతర కళాశాలల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వైవీయూ వ్యాయామ విద్య, క్రీడా శాస్త్రాల బోర్డు కార్యదర్శి డా.రామసుబ్బారెడ్డి గురువారం తెలిపారు. పురుషులు, మహిళలకు రోలర్ స్కెటింగ్, రైఫిల్ షూటింగ్, యోగా, టేబుల్ టెన్నిస్ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు వారి ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్లపై ప్రిన్సిపల్తో అటెస్టేషన్ చేయించుకోవాలన్నారు. వయసు 17-25 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు.
News October 30, 2025
PGRS ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలి: RDO

PGRS ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని కడప RDO జాన్ ఇర్విన్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. సిద్దవటం MRO కార్యాలయంలో గురువారం PGRSపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రజా వేదికలో ఫిర్యాదు చేసిన ఫిర్యాదు దారులతో RDO చరవాణిలో మాట్లాడారు. అలాగే ఆయన గోల్డెన్ రికార్డ్స్, రీసర్వేపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.
News October 30, 2025
ప్రొద్దుటూరు: కుమారుని వివాహానికి వెళ్తూ తండ్రి మృతి

నెల్లూరు జిల్లాలో కుమారుని వివాహానికి వెళ్తూ ప్రొద్దుటూరుకు చెందిన బాషా సయ్యద్ పాల్ (50) మృతి చెందారు. బుధవారం రాత్రి నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈయన మృతి చెందారు. దీంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. UPకి చెందిన సయ్యద్ పాల్ ప్రొద్దుటూరులో ఉంటున్నారు. ఆయనతో పాటు సమీప బంధువు సయ్యద్ ఆసిఫ్(20) కూడా మృతి చెందాడు.


