News April 10, 2024
ఒక్కో జట్టుకు 8 మంది ప్లేయర్ల రిటైన్?

ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఒక్కో ఫ్రాంచైజీ 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెజారిటీ జట్లు ఇదే భావనలో ఉన్నట్లు సమాచారం. కానీ ముగ్గురు లేదా నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకోవాలని గతంలో ఐపీఎల్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. కాగా ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఐపీఎల్ మెగా వేలం నిర్వహిస్తారు. ఈ సారి 2025లో జరగనుంది. ఇందులో దాదాపు 1000 మందికిపైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు.
Similar News
News March 25, 2026
ఇందిరమ్మ ఇండ్లు.. లక్ష దాటిన శ్లాబులు

TG: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,13,365 ఇళ్ల శ్లాబులు పూర్తయినట్లు హౌసింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు లబ్ధిదారులకు ₹5,376.22 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం మరో 2.65 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వర్క్ ప్రోగ్రెస్ను బట్టి ప్రతివారం బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొంది.
News March 25, 2026
ఇరాన్ మైండ్ గేమ్: చమురు అస్త్రం సక్సెస్?

అగ్రరాజ్యాన్ని ఎదిరించి ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. యుద్ధంతో కలిగించే నష్టాల కంటే సుదీర్ఘ ఘర్షణతో గ్లోబల్ ఆయిల్ సంక్షోభం సృష్టించాలనే ఇరాన్ మైండ్ గేమ్ ఫలించిందని నిపుణులు అంటున్నారు. ఇంధన కొరత భయంతో ట్రంప్ వెనక్కి తగ్గడం, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును అంగీకరించడం ఆ దేశ వ్యూహాత్మక విజయానికి నిదర్శనం. నాయకత్వ మార్పు కోరుకున్న US చివరకు అదే నాయకత్వంతో రాజీకి రావడం ఇరాన్ సక్సెస్ను చాటిచెబుతోంది.
News March 25, 2026
రింకూకు KKR ప్రమోషన్

కోల్కతా నైట్ రైడర్స్ (KKR) తమ స్టార్ ప్లేయర్ రింకూ సింగ్ను వైస్ కెప్టెన్గా నియమించింది. రహానే కెప్టెన్గా కొనసాగుతుండగా రింకూ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నారు. RCBకి వెళ్లిపోయిన వెంకటేష్ అయ్యర్ ప్లేస్ను రింకూ భర్తీ చేయబోతున్నారు. కేవలం ఫినిషర్గానే కాకుండా టీమ్ లీడర్గా రింకూను ఎదిగేలా చూడడమే ఫ్రాంచైజీ ప్లాన్.


