News October 30, 2025
ANU: పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం పరిధిలో జులై, ఆగస్టులో నిర్వహించిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ తృతీయ సెమిస్టర్, ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. అవసరమైన విద్యార్థులు నవంబర్ 12లోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తులు అందించాలని సూచించారు.
Similar News
News October 31, 2025
విశాఖ: బెట్టింగ్ యాప్.. మరో ఇద్దరి అరెస్ట్

బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురు బెట్టింగ్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా అచ్యుతాపురం మండలం చీమలపల్లికి చెందిన పెయ్యల త్రినాథ్, హరిపాలేనికి చెందిన కసిరెడ్డి బాల సంజీవరావు కొంతకాలంగా బెట్టింగ్ యాప్లు నడుపుతున్నారని సమాచారం ఇచ్చారు. దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు.
News October 31, 2025
నేటి నుంచి యథావిధిగా పాఠశాలలు తెరవాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో పాఠశాలలను శుక్రవారం నుంచి యథావిధిగా తెరవాలని కలక్టర్ విజయ్కృష్ణన్ ఆదేశించారు. పాఠశాలల శానిటేషన్, క్లోరినేషన్ విషయంలో శ్రద్ద తీసుకొవాలాన్నారు. విద్యార్థుల భద్రతకు టీచర్స్ అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. విద్యార్థులు కాల్వలు, రోడ్డు దాటేతప్పుడు పేరెంట్స్ తగుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరెంట్ స్తంబాలు, నీటికుంటలు దగ్గరకు విద్యార్థులు వెళ్లకుండా చూడాలన్నారు.
News October 31, 2025
అమలాపురం: విద్యార్థులకు అరుదైన అవకాశం

‘స్పేస్ వీక్ సైన్స్ ఎక్స్పోజర్ అండ్ ఎడ్యుకేషన్ టు ఢిల్లీ’ కార్యక్రమానికి అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థినులు ఎంపికయ్యారని డీఈవో షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లా విద్యార్థినులు ఈ అరుదైన అవకాశం దక్కించుకోవడం అభినందనీయమన్నారు. పైడి కొండల రాజేశ్వరి, రాచకొండ సృజన, జ్ఞానపూర్ణ దేవి దీక్షిత, ఎంహెచ్ఎస్ వి అనూష ఎంపికైన వారిలో ఉన్నారని డీఈవో వెల్లడించారు.


