News October 30, 2025
ముంబై కిడ్నాప్.. ఆ 35 నిమిషాలు ఏం జరిగింది?

ముంబై <<18151381>>కిడ్నాప్ <<>>ఘటనలో క్విక్ రియాక్షన్ టీమ్ 35 నిమిషాల ఆపరేషన్ నిర్వహించింది. 8మంది కమాండర్ల టీమ్ బాత్రూమ్ ద్వారా స్టూడియోలోకి వెళ్లింది. తొలుత నిందితుడు రోహిత్తో చర్చలు జరిపింది. కానీ లోపలికొస్తే షూట్ చేస్తానని, గదిని తగలబెడతానని అతడు బెదిరించాడు. తర్వాత ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో రోహిత్పై లీడ్ కమాండో కాల్పులు జరిపి గాయపరిచారు. అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించగా అక్కడ రోహిత్ చనిపోయాడు.
Similar News
News October 31, 2025
తథాస్తు దేవతలు నిజంగానే ఉంటారా..?

హిందూ సంప్రదాయం ప్రకారం.. అసుర సంధ్యా వేళలో ‘చారణులు’ అనే దేవతలు ఆకాశంలో సంచరిస్తూ ఉంటారట. ఈ సమయంలో మనం ఏం మాట్లాడినా వారు ‘తథాస్తు’ అని దీవిస్తారని పండితులు చెబుతున్నారు. అందుకే సాయంకాలం చెడు మాటలు మాట్లాడొద్దని మన పెద్దలు చెబుతుంటారు. మట్లాడేటప్పుడు తొలుత మనం చెడు మాట పలికితే.. ఆ దేవతలు పూర్తి మాట వినకుండా ఆ మొదటి మాటకే ‘తథాస్తు’ అనేస్తారట. అందుకే సాయంత్రం వేళ మంచి మాత్రమే మాట్లాడాలి.
News October 31, 2025
ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్లో 30 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అహ్మదాబాద్లోని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీలో 30 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్-B పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఐటీఐ, డిప్లొమా అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.750. వెబ్సైట్: https://www.prl.res.in/
News October 31, 2025
AP న్యూస్ రౌండప్

➤ ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రాష్ట్రానికి రూ.150కోట్లు విడుదల చేసిన కేంద్రం
➤ SC, ST అట్రాసిటీ బాధితులకు రాయితీపై రుణాలు: మాల కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్
➤ NOV 2 నుంచి లండన్ పర్యటనకు మంత్రి దుర్గేశ్.. అక్కడ జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్-2025లో పాల్గొననున్న మంత్రి
➤ రాష్ట్ర వ్యాప్తంగా 1,592 స్కూళ్లలో బాలికలకు కరాటేలో శిక్షణ.. 2025-26 అకడమిక్ ఇయర్లో 2 నెలల పాటు 20 తరగతుల నిర్వహణ


