News October 30, 2025
సజ్జనార్ ఆకస్మిక తనిఖీ: సాంకేతికత వాడకంపై ఆదేశం

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం బంజారాహిల్స్లోని కమిషనర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడ్మిన్, ఐటీ, కంట్రోల్ రూమ్ సహా వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. పీసీఆర్లో ఇంటిగ్రేటెడ్ పెట్రోలింగ్ సిస్టమ్, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయంపై ఆరా తీశారు. సిబ్బంది నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. విధుల్లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలన్నారు
Similar News
News October 31, 2025
HYDలో రోడ్డు భద్రతకు GHMC కొత్త యాప్

నగర రోడ్ల భద్రతకు GHMC యాప్ తీసుకొచ్చింది. ఫీల్డ్ ఇంజినీర్లు రోడ్ల పరిస్థితిని పరిశీలించి, సమాచారాన్ని అప్డేట్ చేయడానికి ‘పీరియాడిక్ పబ్లిక్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ యాప్’ స్టార్ చేసింది. ఇందులో పాత్హోల్స్, మాన్హోల్స్, రాళ్లు, ఓపెన్ ఎలక్ట్రికల్ బాక్స్లు, బ్యారికేడింగ్ సమస్యలు గుర్తించి జియోట్యాగ్ ఫొటోలను అప్లోడ్ చేస్తారు. వాటిమీద యాక్షన్ తీసుకుంటున్నారా, లేదా తెలుసుకోవచ్చు.
SHARE IT
News October 31, 2025
హీట్ రాజుకున్న జూబ్లీహిల్స్ బైపోల్

జూబ్లీ బైపోల్ ప్రచారం తారస్థాయికి చేరింది. ఇప్పటికే కాంగ్రెస్, BRS, BJP ఇక్కడ మకాం వేశాయి. నేడు సీఎం రేవంత్రెడ్డి, KTR రోడ్షో నిర్వహించనున్నారు. ఒకేరోజు ఇరుపార్టీల కీలకనేతలు ప్రచారంలో పాల్గొననుండటం, MIM నుంచి పలువురు నేతలు BRSలో చేరనున్నారని వార్తలు రావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్ర రాజకీయాలన్నీ జూబ్లీహిల్స్ వైపే మళ్లాయి. ప్రచారంలో వీరిద్దరు ఏం మాట్లాడతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News October 31, 2025
Rewind: నిజాం నవాబుకు.. పటేల్ జవాబు

1947లో దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుతుంటే.. HYD సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో నలుగుతోంది. రజాకారుల దౌర్జన్యాలు, అరాచకాలతో జనాలు తల్లడిల్లుతున్నారు. సంస్థానాన్ని PAKలో కలపాలని ఖాసీంరజ్వీ కుట్ర పన్నాడు. ఇది చూసి పటేల్ హృదయం రగిలింది. నిజాం బంధనాల నుంచి విడిపించాలని సంకల్పించారు. భారత బలగాలను నగరానికి పంపారు. కేవలం 108 గంటల్లో అసఫ్జాహీ పాలనకు తెరదించారు.
*నేడు సర్దార్ పటేల్ జయంతి. సలాం సర్దార్.


