News October 30, 2025

నష్టపోయిన తారవ్వకు బండి సంజయ్ ₹50 వేల సాయం

image

భారీ వర్షాలకు పంట నష్టపోయి కన్నీరుమున్నీరైన హుస్నాబాద్ నియోజకవర్గం పోతారం గ్రామానికి చెందిన రైతు తారవ్వకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అండగా నిలిచారు. ఢిల్లీ నుంచి ఆమెకు ఫోన్ చేసి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. తక్షణ సాయంగా ₹50 వేలు పంపిస్తున్నట్లు ప్రకటించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Similar News

News October 31, 2025

సిరిసిల్ల: నిద్రలోనే కన్నుమూసిన మహిళ

image

ఓ మహిళ నిద్రలోనే కన్నుమూసిన ఘటన సిరిసిల్ల(D) గంభీరావుపేట మండలం దోసెలగూడెంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మల లక్ష్మణ్ భార్య లక్ష్మి(48) హఠాత్తుగా నిద్రలోనే కన్నుమూశారు. కాగా, ఆమె గుండెపోటుతో మృతిచెందినట్లు స్థానికులు అంటున్నారు. మృతురాలి భర్త కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కావడంతో భారీసంఖ్యలో నాయకులు, స్థానికులు ఆయన నివాసానికి చేరుకుని ఓదార్చారు.

News October 31, 2025

UPDATE: నవ దంపతులను తీసుకొస్తుండగా యాక్సిడెంట్

image

హనుమకొండ జిల్లాలో రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో <<18155214>>ముగ్గురు మృతి<<>>చెందిన విషయం తెలిసిందే. బంధువులు తెలిపిన వివరాలిలా.. కురవి మండలం సూధనపల్లికి చెందిన యువతికి బుధవారం పెళ్లైంది. నవదంపతులను తీసుకొస్తుండగా గోపాలపురం వద్ద రోడ్డు పక్కకు ఆపిన వీరి బోలేరోను వేగంగా వచ్చిన బోర్ వెల్స్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనాథ్, స్వప్న, కలమ్మ స్పాట్‌లోనే మృతి చెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News October 31, 2025

కర్నూలు ప్రమాదం.. కార్గో క్యాబిన్‌లో రెండో డ్రైవర్ నిద్ర

image

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఘటన జరిగినప్పుడు 2వ డ్రైవర్ శివనారాయణ బస్సు కింది భాగంలోని కార్గో క్యాబిన్‌లో నిద్రపోయారు. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ లక్ష్మయ్య తన వద్దకు వచ్చినట్లు శివ తెలిపారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపు కాలేదన్నారు. బస్సు కుడివైపు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించామని, ఆ ప్రయత్నం వల్ల 27మంది బతికారని చెప్పారు. ఈ ఘటనలో 19మంది చనిపోయారు.