News October 31, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జిల్లా వ్యాప్తంగా ఉప్పొంగిన వాగులు, వంకలు
> పలు చోట్ల నిలిచిపోయిన రాకపోకలు
> మాధారంలో 60 బస్తాల వరి ధాన్యం వరద పాలు
> జఫర్గడ్: వరద నీటిలో కొట్టుకుపోయి యువతి మృతి
> వెల్దండలో తెగిన రోడ్డు 80 గొర్రెలు గల్లంతు
> పాలకుర్తి: ఇంటిలోకి చేరిన వర్షపు నీరు
> దేవరుప్పుల: విద్యుత్ షాక్‌తో గేదె మృతి
> జనగామ డీపీవోగా నవీన్ బాధ్యతలు స్వీకరణ
> జిల్లాస్థాయి యువజన కళాకారుల ఎంపిక వాయిదా

Similar News

News October 31, 2025

శ్రీను హత్యకు ఆ ఆడియోనే కారణమా!

image

అమలాపురం(M) కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను హత్యకు ఫోన్ కాల్ ఆడియోనే కారణమా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గంగుమళ్ళ కాసుబాబుతో శ్రీను మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మృతుడు శ్రీను, కాసుబాబు మధ్య జరిగిన వ్యక్తిగత దూషణలు, ఆ ఆడియో వేరే వాళ్లకు పంపడం హత్యకు దారితీశాయని అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల ఇందుకు మూలంగా భావిస్తున్నారు.

News October 31, 2025

నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన

image

TG: రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావం దాదాపుగా ముగిసినట్లేనని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇవాళ మాత్రం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.

News October 31, 2025

సిద్దిపేట: వాగులో దంపతుల మృతదేహాలు లభ్యం

image

అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగులో వరద ప్రవాహానికి HNK జిల్లా భీమదేవరపల్లికి చెందిన <<18150389>>దంపతులు<<>> ఈసంపల్లి ప్రణయ్(28), కల్పన(24) గల్లంతైన విషయంతెలిసిందే. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఇవాళ ఉదయం ప్రణయ్, కల్పన మృతదేహాలను గుర్తించారు. కాగా మృతదేహాలను పట్టుకొని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.