News October 31, 2025
సర్దార్ పటేల్ ఫ్యామిలీతో మోదీ భేటీ

భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వారితో సంభాషణ, దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలను గుర్తు చేసుకోవడం గొప్పగా ఉందని Xలో పేర్కొన్నారు. గుజరాత్లోని కేవడియాలో సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ఆయనకు నివాళిగా స్పెషల్ కాయిన్, స్టాంప్ను మోదీ రిలీజ్ చేశారు. ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం(182 మీటర్లు) ఉంది.
Similar News
News November 1, 2025
ఈ కోళ్లు రోజూ గుడ్లు పెడతాయని తెలుసా?

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలం. ఏడాదిలో 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18-20 వారాల పాటు పెంచిన తర్వాత అవి గోధుమ రంగులో పెద్ద గుడ్లను పెడతాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు. ✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 1, 2025
పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా? థైరాయిడ్ కావొచ్చు

ప్రస్తుతం థైరాయిడ్ వ్యాధి పిల్లలకు కూడా వస్తోంది. పిల్లల్లో ఈ సమస్యను నివారించాలంటే లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. పిల్లలు అలసిపోయినట్లు అనిపించడం, తరచూ అనారోగ్యానికి గురికావడం, చర్మం, పొడిగా, నిర్జీవంగా మారడం, మలబద్ధకం, అజీర్ణం, థైరాయిడ్ గ్రంధి పరిమాణం పెరగడం, కళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
News November 1, 2025
కేశినేని చిన్ని VS కొలికపూడి.. చంద్రబాబు ఆగ్రహం

AP: MP కేశినేని చిన్ని, MLA కొలికపూడి మధ్య <<18088401>>విభేదాలపై<<>> CM CBN మండిపడ్డారు. వారి నుంచి వివరణ తీసుకుని తనకు నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. ‘పార్టీ నేతలు ఇలా ఆరోపణలు చేసుకోవడం ఎప్పుడూ జరగలేదు. పార్టీ టికెట్ ఇస్తేనే గెలిచామని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ సిద్ధాంతాల గురించి తెలియని వారికి, పొలిటికల్ అనుభవం లేని వారికి టికెట్లిచ్చి తొందరపడ్డానేమో’ అని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు.


