News October 31, 2025

దస్తూరాబాద్: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన దస్తూరాబాద్ మండలంలోని రేవోజిపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రేవోజిపేట గ్రామంలోని కొత్త పల్లెలోని ముప్పిడి రాధ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.

Similar News

News October 31, 2025

NLG: ఆ నిబంధనలు.. రైతులతో పరిహాసమే!

image

అటు ప్రకృతి.. ఇటు పాలకులు రైతులకు కన్నీరు తెప్పిస్తున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీగానే పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నేలవాలడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. 33 శాతానికి పైగా దెబ్బతింటేనే పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందే సూచనలు కనిపించడం లేదు. జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 61,511 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.

News October 31, 2025

నెట్‌వర్క్ ఆస్పత్రులకు వన్ టైం సెటిల్మెంట్!

image

AP: ‘NTR వైద్య సేవ’ కింద నెట్‌వర్క్ ఆస్పత్రులకు వన్‌టైం సెటిల్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ASHA ప్రతినిధులతో భేటీ అయిన అధికారులు 20 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని కోరగా, ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని వారు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.250CR రిలీజ్ చేసి, విడతల వారీగా చెల్లిస్తామన్నా సమ్మె విరమించలేదు. దీంతో వన్‌టైం సెటిల్మెంటే మార్గమని భావిస్తున్నట్లు సమాచారం.

News October 31, 2025

నేటి నుంచి విజయ డెయిరీ దుకాణాలకు టెండర్లు

image

ఖమ్మం నగరంలోని విజయ డెయిరీ ఆవరణలో నిర్మించిన 10 దుకాణ సమూదాయాలను అద్దెకు ఇచ్చేందుకు నవంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు టెండర్లు నిర్వహిస్తున్నట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కోడిరెక్క రవికుమార్ తెలిపారు. ఒక్కో దుకాణానికి నెలకు రూ.15వేలుగా నిర్ణయించామని, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2 లక్షలు చెల్లించాలన్నారు.