News April 10, 2024

ఎవరెక్కువ అబద్ధాలు చెబుతున్నారంటే?

image

ఆడవారికంటే మగవారే ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నట్లు బ్రిటన్‌లో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. మహిళలు ఏడాదికి సగటున 728 అబద్ధాలు చెబితే.. పురుషులు ఏకంగా 1,092 అబద్ధాలు ఆడుతున్నారట. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో కంటే నేరుగా కలిసినప్పుడు మరిన్ని అబద్ధాలు చెబుతున్నారట. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి?

Similar News

News September 16, 2025

పాక్‌కు అవమానం.. మాట ప్రకారం తప్పుకుంటుందా?

image

IND vs PAK మ్యాచ్‌‌ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని PCB చేసిన <<17717948>>ఫిర్యాదును<<>> రిజెక్ట్ చేసినట్లు ICC అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆసియా కప్‌ నుంచి తప్పుకుంటామన్న పాక్‌‌కు ఘోర అవమానం ఎదురైంది. మొన్న గ్రౌండ్లో ప్లేయర్లకు, ఇప్పుడు ఆ దేశ బోర్డుకు భంగపాటు తప్పలేదు. మాట మీద నిలబడి టోర్నీ నుంచి తప్పుకుంటే పాక్‌కు కనీస మర్యాదైనా దక్కుతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News September 16, 2025

డబ్బు ఇస్తామన్నా తెచ్చుకోలేమా..? అధికారులపై ఫైరైన CM!

image

తెలంగాణ CM రేవంత్ కొందరు ఉన్నతాధికారులపై మండిపడ్డట్లు తెలుస్తోంది. గతవారం ఢిల్లీ టూర్లో కేంద్రమంత్రి గడ్కరీకి CM, TG అధికారులు ₹1600 కోట్ల పనుల DPR ఇచ్చారు. అప్పుడు వారితో ₹1600 కోట్లు కాదు.. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల DPR తెస్తే ₹20వేల కోట్లు ఇస్తామని గడ్కరీ అన్నారట. దీంతో డబ్బు ఇస్తామన్నా ఎందుకు డ్రాఫ్ట్ రెడీ చేయలేదని, సీనియర్ అధికారులై ఉండి ఏం లాభమని వారిపై రేవంత్ ఫైర్ అయ్యారని సమాచారం.

News September 16, 2025

దళితవాడల్లో 1,000 ఆలయాలు: TTD

image

AP: మత మార్పిడుల నివారణకు దళితవాడల్లో 1,000 ఆలయాలు నిర్మిస్తామని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో 6 ఆలయాలు నిర్మిస్తామన్నారు. టీటీడీ ధర్మకర్తల సమావేశం నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ‘ఈ నెల 24 నుంచి వచ్చే నెల 2 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. ఆ రోజుల్లో VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నాం. 24న సీఎం దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు’ అని వివరించారు.