News October 31, 2025

సిద్దిపేట: వాగులో దంపతుల మృతదేహాలు లభ్యం

image

అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగులో వరద ప్రవాహానికి HNK జిల్లా భీమదేవరపల్లికి చెందిన <<18150389>>దంపతులు<<>> ఈసంపల్లి ప్రణయ్(28), కల్పన(24) గల్లంతైన విషయంతెలిసిందే. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఇవాళ ఉదయం ప్రణయ్, కల్పన మృతదేహాలను గుర్తించారు. కాగా మృతదేహాలను పట్టుకొని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

Similar News

News October 31, 2025

పెద్దపల్లి: ‘NOV 11న యువజనోత్సవ పోటీల నిర్వహణ’

image

PDPL యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో NOV 11న 29వ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువజన ఉత్సవ పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ సురేష్ తెలిపారు. జానపద నృత్యం, గేయం, కథారచన, పెయింటింగ్, కవిత్వం, ఇన్నోవేషన్ ట్రాక్ పోటీలు జరగనున్నాయి. జిల్లాస్థాయిలో విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అవుతారని చెప్పారు. ఆసక్తిగల యువతీ యువకులు PDPL అమర్‌నగర్ సిరి ఫంక్షన్ హాల్‌లో జరిగే పోటీలలో పాల్గొనాలని పిలుపునచ్చారు.

News October 31, 2025

శిర్డీలో వేమిరెడ్డి దంపతులు

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు శిర్డీకి వెళ్లారు. బాబాను శుక్రవారం దర్శించుకున్నారు. సాయినాథుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

News October 31, 2025

రాయచోటిలో అనుమానాస్పద స్థతిలో యువకుడి మృతి

image

రాయచోటిలో శుక్రవారం రాత్రి యువకుడు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. రాయచోటి కడప రహదారిలోని హోటల్ దగ్గర లారీ ఢీకొని గుర్తు తెలియని యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మృతుడు ఎవ్వరనే విషయాన్ని ఇంత వరకు తేలలేదన్నారు. ఇది హత్య? లేక రోడ్డు ప్రమాదమా..? అని తెలియాల్సి ఉందన్నారు.