News October 31, 2025
సిరిసిల్ల: ఈ ‘అక్కాచెల్లెళ్లకు GOLD’ MEDALS..!

సిరిసిల్ల(D) చందుర్తి(M) లింగంపేటకు చెందిన కాదాసు నీరజ, నర్మదా NOV 7న SU స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులతో బంగారు పతకాలు అందుకోనున్నారు. నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఈ అక్కాచెల్లెళ్లు అగ్రహారం కాలేజీలో 2020- 22లో MA తెలుగు పూర్తిచేశారు. నర్మద ఆధునిక కవిత్వం, నీరజ జానపద విజ్ఞానం అంశాల్లో అత్యధిక మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వీరిని గ్రామస్థులు అభినందిస్తున్నారు.
Similar News
News November 1, 2025
తిరుపతి: ఎకరాకు 3 బస్తాల యూరియా

తిరుపతి జిల్లాలోని రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు, అధికారులతో సమీక్షించారు. యూరియా కార్డుల ద్వారా ప్రతి రైతుకు ఎకరాకు 3బస్తాలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు.
News November 1, 2025
సంగారెడ్డి: కరాటే శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

జిల్లాలోని 37 పీఎంశ్రీ పాఠశాలలో కరాటే శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కుంగ్ ఫు, జోడో, కలర్ కలరిపయట్టు నేర్పించే ఏజెన్సీలు ఈనెల 3వ తేదీ వరకు కలెక్టరేట్లోని రెండో అంతస్తులో ఉన్న సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తు చేయాలని చెప్పారు. ఎంపికైన వారు విద్యార్థులకు కరాటే నేర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
News November 1, 2025
JEE మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్-2026 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. <


